శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు : కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్

By telugu news teamFirst Published Feb 29, 2020, 11:13 AM IST
Highlights

బాధితుడి వివరాల ప్రకారం.. కృష్ణనగర్ లో ఏ బ్లాక్ లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డాన్స్ అండ్ డ్యాన్సర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని.. ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశానని.. ప్రస్తుతం ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. 

సినీ నటి శ్రీరెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు అలియాస్ రాకేష్ మాస్టర్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. కృష్ణనగర్ లో ఏ బ్లాక్ లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డాన్స్ అండ్ డ్యాన్సర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని.. ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశానని.. ప్రస్తుతం ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు.

అయితే గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె మనుషులతో ఫోన్‌ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని.. అక్కడి పోలీసులను హైదరాబాద్ కి పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి మరీ కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు.

సినిమా ఫట్ అంటగా.. హీరో నానిపై శ్రీరెడ్డి సెటైర్లు!

అలానే కూనియర్ ఎన్టీఆర్ గురించి తాను చెప్పిన మాటలను అపార్ధం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రతీరోజు ఫోన్లు చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా.. అసభ్యకరంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను చంపేస్తామని కూడా బెదిరించారని అన్నారు.

ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

click me!