అలీ కుటుంబానికి పవన్ సానూభూతి!

By AN TeluguFirst Published Dec 19, 2019, 4:16 PM IST
Highlights

ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసుకున్న సినీ ప్రముఖులు అలీ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. 

ప్రముఖ హాస్యనటుడు అలీ తన తల్లిని కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్‌ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు  కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసుకున్న సినీ ప్రముఖులు అలీ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అలీ నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ali mother: అలీ తల్లి మృతి.. మెగాస్టార్ నివాళి

అందులో.. ''అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను'' అంటూ రాసుకొచ్చారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. కాగా, తల్లిపై తనకున్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు స్టేజ్ పై కూడా అలీ తన తల్లి గురించి గొప్పగా చెప్పేవారు. 
 

click me!