సర్ ప్రైజ్.. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ప్లాన్ మొదలైంది

By tirumala ANFirst Published May 26, 2020, 3:31 PM IST
Highlights

ఎన్టీఆర్, ఏఎన్నార్.. కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పట్లో అగ్ర హీరోలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ టాలీవుడ్ లో తగ్గింది. అగ్ర హీరోలంతా ఎవరికి వారు సోలో చిత్రాలు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్.. కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పట్లో అగ్ర హీరోలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ టాలీవుడ్ లో తగ్గింది. అగ్ర హీరోలంతా ఎవరికి వారు సోలో చిత్రాలు చేసుకుంటున్నారు. వెంకటేష్ మాత్రం మల్టీస్టారర్ చిత్రాలకు మూలస్తంభంలా మారారు. 

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ మెగా, నందమూరి అభిమానులని సర్ ప్రైజ్ చేసే న్యూస్ ఒకటి వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ మొదలైందట. 

పెళ్ళై పిల్లలున్న స్టార్ హీరోయిన్ భర్తతో ఎఫైర్.. మంటలు రేపుతున్న ఇలియానా

స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా కాలం క్రితమే ప్రముఖ పొలిటీషియన్, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డికి చిరు,బాలయ్య మల్టీస్టారర్ ఐడియా వివరించారట. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ ఓ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కథ విన్నాక సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, బాలయ్య తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో కూడా సుబ్బిరామిరెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా మెగా మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా పేర్కొన్నారు. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.  

 

click me!