బాహుబలి 2ని బద్దలు కొట్టిన మహేష్.. భళా అనిపించిన సాయిధరమ్ తేజ్

By tirumala ANFirst Published Apr 2, 2020, 4:33 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. పరాజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. పరాజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం 120 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టి మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

మహేష్ కి జోడిగా యంగ్ బ్యూటీ రష్మిక మందన నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్దనే కాదు.. బుల్లితెరపై కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రం జోరు కొనసాగించింది. ఇటీవల ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ ఛానల్ లో ప్రదర్శించగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యాయి. 

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఏకంగా బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది. బాహుబలి 2 చిత్రం ఇప్పటి వరకు అత్యధికంగా 22.7 టిఆర్పి రేటింగ్ లో అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డుని అధికమిస్తూ మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 రేటింగ్ సాధించడం విశేషం. 

పునర్నవి హాట్ యోగా పిక్స్.. పిచ్చెక్కిస్తున్నాయి!

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఈ స్థాయిలో టిఆర్పి రేటింగ్ నమోదు కావడానికి కారణం లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా అనే వాదన వినిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. 

ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ మారుతి, రాశి ఖన్నా కాంబోలో వచ్చిన ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా బుల్లితెరపై సత్తా చాటింది. ఈ చిత్రానికి 15.3 టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. 

click me!