బాలీవుడ్ ఫ్రాంఛైజ్ లో మహేష్.. మరో హీరో కూడా..!

By telugu news teamFirst Published Feb 27, 2020, 2:03 PM IST
Highlights

రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నారు. మొదట వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు...బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియవాలా ....ఎలాగైనా మహేష్ ని హిందీకి తీసుకురావాలని కంకణం కట్టుకుని వర్క్ అవుట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకోసం బాలీవుడ్లో హై సక్సెస్ పొందిన ప్రాంచైజ్ ని ఎన్నుకున్నారట. ఇందులో రణవీర్ సింగ్ ఒక హీరోగా చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మరో హీరోగా మహేష్ ని అడగనున్నారట. ఈ మేరకు బాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి.  అయితే మహేష్ దగ్గరకు ప్రపోజల్ మాత్రం వచ్చిందిట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

'ఆచార్య'లో మహేష్ క్యారక్టర్.. వింటేనే రోమాంచితం!

ఇక ఇదే కనుక జరిగితే రణవీర్ సింగ్, మహేష్ కాంబినేషన్ ఇటు సౌత్ ని అటు బాలీవుడ్ ని దుమ్ము రేపుతుందని అంటున్నారు. రణవీర్ సింగ్ కు సైతం సౌత్ లో మార్కెట్ ఏర్పడుతుంది. మహేష్ కు హిందీలో బేస్ వస్తుంది. అయితే హఠాత్తుగా ఈ వార్తలు వెనక కారణం..రీసెంట్ గా ఈ హీరోలిద్దరు కలిసి ధమ్స్ అప్ యాడ్ చేసారు. అది చూసిన సాజిద్ నడియవాలా ఈ ప్రపోజల్ కు ఉత్సాహపడుతున్నారట. అయితే మహేష్ కు ఇస్తే సోలోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనేది ఇంట్రస్ట్. అది కూడా ఇప్పుడిప్పుడే ఉండదని చెప్తూ వస్తున్నారు.

రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నారు. మొదట వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నారు. అయితే అది స్క్రిప్టు వర్క్ పూర్తి కాలేదని ప్రక్కన పెట్టేసారట. దాంతో తన నెక్ట్స్ పరుశరామ్ తో చేసే అవకాసం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ఈ లోగా చిరంజీవి 152 వ సినిమాలో కీలకమైన పాత్రలో మహేష్ కనిపించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

 

click me!