కొంతమంది దర్శకులతో పనిచేస్తే కష్టం తెలియదు.. రామజోగయ్య శాస్త్రి!

By AN TeluguFirst Published Jan 6, 2020, 9:25 PM IST
Highlights

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని చిత్రబృందాన్ని విష్ చేశారు. 
 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

'కొట్టేస్తున్నారు.. బ్లాక్ బస్టర్'.. 'అల వైకుంఠపురములో' రిజల్ట్ ముందే చెప్పేసిన దిల్ రాజు!

ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ మొత్తం హాజరైంది. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాలో 'బుట్టబొమ్మ' అనే పాటని రాశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది దర్శకులతో పని చేస్తే కష్టం తెలియదు.. సమయం తెలియదు.. అటువంటి వ్యక్తే త్రివిక్రమ్ అని అన్నారు.

'బుట్టబొమ్మ' సాంగ్ కి ఎక్కువ సమయం తీసుకోలేదని.. త్రివిక్రమ్ తో పని చేయడమంటే పండగ వాతావరణం ఉంటుందని.. చాలా నేర్చుకోవచ్చని చెప్పారు. తమన్ ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాకి పని చేశారని చెప్పారు. అల్లు అర్జున్ కి సాంగ్ రాయడం సంతోషంగా ఉందని అన్నారు.   

click me!