ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడట్లేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్

By AN TeluguFirst Published Dec 21, 2019, 11:30 AM IST
Highlights

హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో లావణ్యకి అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇటీవల ఆమె నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఏ1ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. 

ప్రస్తుతం ఆడియన్స్ ఎవరూ స్కిన్ షోని పట్టించుకోవడం లేదని అంటోంది టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగులో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ అమ్మడు కెరీర్ లో రెండు,మూడు హిట్లు తప్ప చెప్పుకునే స్థాయిలో సినిమాలు పడలేదు.

హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో లావణ్యకి అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇటీవల ఆమె నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఏ1ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది లావణ్య త్రిపాఠి.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

ఇందులో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రేక్షకులు హీరోయిన్ల గ్లామర్ గురించి మాట్లాడుకునేవారని.. స్కిన్ షో చేస్తే చూడాలని కోరుకునేవారని చెప్పిన లావణ్య ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని వెల్లడించింది. హీరోయిన్ల గ్లామర్ కంటే సినిమాలో ఆమె లుక్, నటననే ఎక్కువగా పట్టించుకుంటున్నారని చెప్పింది.

ఇటీవలి కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరిగిందని.. ఇది మంచి పరిణామమని చెప్పింది. తెరపై మహిళలను చూసే, చూపించే కోణంలో మార్పు వచ్చిందని లావణ్య వెల్లడించింది.

 

ఇక తను హాకీ ప్లేయర్ గా నటించడం గురించి మాట్లాడుతూ.. మేకోవర్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పింది. స్పోర్ట్స్ డ్రామాలో నటించాలంటే చాలా ప్రిపేర్ అవ్వాలని.. ఈ ప్రాసెస్ లో తనకు క్రమశిక్షణ బాగా పెరిగిందని చెప్పింది. 'ఏ1ఎక్స్ ప్రెస్' సినిమా కోసం హాకీ క్లాసెస్ తో పాటు బైక్ రైడింగ్ క్లాసెస్ కూడా వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. 
 

click me!