గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహానటి.. ఫొటోస్

By tirumala ANFirst Published Feb 9, 2020, 7:08 PM IST
Highlights

క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. మహానటి చిత్రం తీసుకువచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. మహానటి చిత్రం తీసుకువచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో కీర్తి సురేష్ మొక్కలు నాటింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమంపొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో  అందరూ పాల్గొన్నీ చెట్లను పెంచాలి అని కొరారూ. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

click me!