`అల.. వైకుంఠపురములో` తర్వాత సినిమా గురించి ఆయన ఇప్పటిదాకా ఏమీ ప్రకటించలేదు కానీ, స్క్రిప్టు మాత్రం సిద్ధమైనట్టు సమాచారం. త్రివిక్రమ్ తదుపరి చేయనున్న సినిమాల్లో హీరోలంటూ ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , రామ్చరణ్ వంటి స్టార్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి
టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్ రూటే వేరు. తెలుగుదనం ఉట్టిపడేలా టైటిల్స్ ఫిక్స్ చేస్తూంటారు. అదే సమయంలో అ అక్షరంతో మొదలయ్యేలా ..టైటిల్ ని ఫిక్స్ చేస్తూ సెంటిమెంట్ ని కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సక్సెస్ కు దూరంగా ఉండిపోయిన ఆయన `అజ్ఞాతవాసి` తో మరీ విమర్శల పాలయ్యారు. అయితే “అరవింద సమేత” సినిమా తర్వాత మళ్లీ తన సక్సెస్ ని కంటిన్యూ చేసిన త్రివిక్రమ్, ఎప్పటిలాగే సక్సెస్ మీట్ లకు, పార్టీలకు దూరంగా మళ్ళీ తన తర్వాతి సినిమా పనుల్లో మునిగిపోయాడు.
`అల.. వైకుంఠపురములో` తర్వాత సినిమా గురించి ఆయన ఇప్పటిదాకా ఏమీ ప్రకటించలేదు కానీ, స్క్రిప్టు మాత్రం సిద్ధమైనట్టు సమాచారం. త్రివిక్రమ్ తదుపరి చేయనున్న సినిమాల్లో హీరోలంటూ ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , రామ్చరణ్ వంటి స్టార్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎవరు ఫైనల్ కాలేదు.
'అల.. వైకుంఠపురములో' విజయోత్సవ వేడుక రేపే, వివరాలు!
కానీ ఈ చిత్రానికి పెట్టే టైటిల్ అంటూ ఒకటి మాత్రం ప్రచారంలోకి వచ్చింది. `అయిననూ పోయిరావలె హస్తినకి` అనే పేరుతో త్రివిక్రమ్ కొత్త సినిమాని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ‘ప్రయోజనం లేని రాయభారం అని తెలిసీ.. అయిననూ పోయిరావలె హస్తినకు’ అని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే వారికి స్ఫూర్తినిచ్చాయో ఏమో!!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ సోషల్ ఎలిమెంట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు చెప్తున్నారు. ఎన్టీఆర్ నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయాలి. కానీ చిరు వేరే చిత్రంతో బిజీ అయిపోయటంతో ఈ ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లింది. దాంతో త్రివిక్రమ్ ఇమ్మీడియిట్ గా యంగ్ హీరోల్లో ఒకరితో సినిమా పూర్తి చేసే పనిలో పడిపోయారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పూర్తి అయ్యాక.., సుకుమార్ – రామ్ చరణ్ సినిమా కూడా పూర్తయిన తర్వాత వెంటనే ఈ సినిమా ఉంటుందని సమాచారం.