ఎప్పుడు తన ఫోటోలు, పర్సనల్ ట్రిప్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన అంకుల్ మరణించిన సందర్భంగా తన బాధను ఓ సుధీర్ఘమైన పోస్ట్తో అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.
దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ ఇలియానా డిక్రూజ్. తెలుగులో హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ మీద ఆశలో ముంబై వెళ్లిపోయిన ఈ భామ అక్కడ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హిందీలో అవకాశాలు రాక, తెలుగుకు తిరిగి రాలేక ఖాళీగా ఉంటుంది ఈ భామ. అయితే సినిమాలో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ.
ఎప్పుడు తన ఫోటోలు, పర్సనల్ ట్రిప్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన అంకుల్ మరణించిన సందర్భంగా తన బాధను ఓ సుధీర్ఘమైన పోస్ట్తో అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.
`నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, ఆడియో నోట్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నా మనసు ఇప్పటికీ నువ్వు లేవన్న నిజాన్ని నమ్మలేకపోతోంది. నాకు తెలిసినంత వరకు నువ్వు అద్భుతమైన, గొప్ప వ్యక్తివి. ఆయన లేరన్న విషయాన్ని మీతో పంచుకోవటం కూడా చాలా బాధగా ఉంది. నేను నిన్ను ఎంతో ఇష్టపడ్డాను. నీతో మరికొంత సమయం గడిపి ఉంటే బాగుండనిపిస్తుంది.
స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఉంటే నువ్వు అక్కడే ఉంటావని ఆశిస్తున్నా. నువ్వు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నా. ఇప్పటికీ నేను కోరుకునేది ఒకటే. రేపు ఉదయం నేను నిద్ర లేచేసరికి ఇదంతా ఓ పీడ కల అయితే బాగుండు. మళ్లీ నీతో ఒక్కసారి మాట్లాడితే బాగుండూ` అంటూ తన ఆవేదననే, బాధను అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.