లైవ్ లో ఏడ్చేసిన యాంకర్ రష్మీ.. అందరిని రిక్వస్ట్ చేస్తూ..

By tirumala ANFirst Published Mar 31, 2020, 9:22 PM IST
Highlights

యాంకర్ రష్మీ మరో మారు మూగ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. కరోనా వైరస్ కారణంగా శునకాలు, పిల్లులు లాంటి మూగజీవాలకు ఆహారం లేకుండా పోయింది.

యాంకర్ రష్మీ మరో మారు మూగ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. కరోనా వైరస్ కారణంగా శునకాలు, పిల్లులు లాంటి మూగజీవాలకు ఆహారం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని రష్మీ తాన్ సోషల్ మీడియాలో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. కొన్ని జంతువులు ఆహారం దొరక్క మరణిస్తున్నాయి. 

దీనితో రష్మీ బరువెక్కిన హృదయంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని మూగ జీవాలకు ఆహారం అందించాలని రష్మీ కోరింది. అలాగే విరాళాలు కూడా అందించాలని కోరింది. ఒక్క రూపాయి ఇచ్చినా మేలు చేసిన వారవుతారని రష్మీ తెలిపింది. 

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆహారం కోసం రష్మీ 25 వేలు విరాళం ఇచ్చింది. స్వయంగా రష్మీ తన ప్రాంతంలోని జంతువులకు ఆహరం ఏర్పాటు చేసింది. రష్మీ కన్నీరు మున్నీరుగా విలపించిన వీడియో వైరల్ అవుతోంది. 

click me!