Hero Rajasekhar: నాకేం ఏం కాలేదు.. హీరో రాజశేఖర్

By AN TeluguFirst Published Nov 13, 2019, 9:54 AM IST
Highlights

మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను.

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.  

రాజశేఖర్ మాట్లాడుతూ "మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు  నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు" అని అన్నారు.

హీరో రాజశేఖర్ కారు బోల్తా.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల ఒక సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి హీరోకు అభిప్రాయం బేధాలు రావడంతో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.దీంతో ఆ చిత్ర నిర్మాత మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరగా రాజశేఖర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రాజశేఖర్ కథల వేటలో పడ్డారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి దర్శకుడితో స్టోరీ డిస్కర్షన్స్ చేస్తున్నారట. కథ ఏ మాత్రం నచ్చిన సినిమాని సెట్స్ పైకి తేవాలని మంచి స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వీరభద్రమ్ చెప్పిన ఒక థ్రిల్లర్ కథ ఈ సినీయార్ హీరోకి బాగా నచ్చేసిందట. దీంతో వెంటనే ఏడు చేపల కథ నిర్మాత శేఖర్ రెడ్డి ప్రొడక్షన్ హౌజ్ లో త కొత్త సినిమాను నిర్మించేందుకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

click me!