ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'జార్జ్ రెడ్డి' జోష్

By Prashanth MFirst Published Dec 21, 2019, 7:02 PM IST
Highlights

చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విద్యార్థి జార్జ్ రెడ్డి. ఇటీవల ఈ విప్లవ వీరుడి జీవిత ఆధారంగా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో స్పెషల్ హైప్ ని క్రియేట్ చేసి మంచి టాక్ ను సొంతం చేసుకుంది,

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విద్యార్థి జార్జ్ రెడ్డి. ఇటీవల ఈ విప్లవ వీరుడి జీవిత ఆధారంగా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో స్పెషల్ హైప్ ని క్రియేట్ చేసి మంచి టాక్ ను సొంతం చేసుకుంది, ఈ సినిమాకు సంబందించిన అనేక రూమర్లు జనాలను ఆకర్షించాయి.

ఇక ఫైనల్ గా ఈ స్టూడెంట్ లీడర్ బయోపిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులను ఆకర్షించింది. త్వరలో జరగబోయే 4వ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం సినిమాను నోయిడా, ఢిల్లీలో ప్రదర్శించనున్నారు. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలనే అందించింది, వరల్డ్ వైడ్ గా సినిమా 6 రోజుల్లోనే  2.40 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ సినిమా ను ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా అమ్మారు. టే మినిమం 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసారు.

click me!