నిర్మాత బండ్ల గణేష్ కు మరో షాక్.. 14 రోజుల రిమాండ్

By Prashanth MFirst Published Oct 24, 2019, 1:03 PM IST
Highlights

 బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం కడప కోర్టులో హాజరపరుచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల్ రిమాండ్ విధించింది. 

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం కడప కోర్టులో హాజరపరుచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల్ రిమాండ్ విధించింది. అంటే నవంబర్ 4వరకు బండ్ల గణేష్ రిమాండ్ లో ఉండనున్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేయగా గత కొంత కాలంగా బండ్ల గణేష్ కోర్టుకు హాజరు కాలేదు. 13కోట్ల అప్పు విషయంలో బండ్ల గణేష్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నాడు. 2013లో మహేష్ అనే వ్యక్తి గణేష్ పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. తీసుకున్న డబ్బు ఇవ్వలేదని పేర్కొనడంతో పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. గతంలో కేసు విషయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత అతడి నిర్మాణంలో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ 2015లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. టెంపర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో బండ్ల గణేష్ చుక్కుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కు బండ్ల గణేష్ కు మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

click me!