ప్రసూన్ పాండే దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ పర్యవేక్షణలో రూపొందిస్తున్న ఫ్యామిలీ షార్ట్ ఫిలింలో ఇంట్లోనే ఉండాల్సిన ఆవశ్యకత, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, ఇంటి నుంచే పనులు చేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్ పాటించటం లాంటి వాటిలో సలహాలు ఇవ్వనున్నారు.
కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బయోత్పాత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజల్లో ఈ పరిస్థితుల పట్ల అవగాహన కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కలిగిస్తూ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఓ షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఇండియా మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ ముందుకు వచ్చారు.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్, అలియా భట్లతో పాటు మరికొందరు కలిసి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఓ లఘు చిత్రంలో నటిస్తున్నారు. కోవిడ్ 19 ప్రభావంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింకు ఫ్యామిలీ అనే టైటిల్ను నిర్ణయించారు.
ప్రసూన్ పాండే దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ పర్యవేక్షణలో రూపొందిస్తున్న ఈ షార్ట్ ఫిలింలో ఇంట్లోనే ఉండాల్సిన ఆవశ్యకత, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, ఇంటి నుంచే పనులు చేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్ పాటించటం లాంటి వాటిలో సలహాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే `వియ్ ఆర్ వన్` అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
ప్రసూన్ రూపొందిస్తున్న షార్ట్ ఫిలిం విషయానికి వస్తే.. ఈ ఫిలింను పూర్తిగా విర్చువల్ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది సెలబ్రిటీలు స్వయంగా నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ఎప్పుడు ఈ ప్లాట్ ఫాంలో ప్రదర్శిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.
సోని పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్తో కలిసి బిగ్ బి, లక్ష కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంపై సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్పీ సింగ్, `కష్టకాలంలో మన మంతా కలిసికట్టుగా ఈ పరిస్థితిపై పోరాడాల్సిన సమయం వచ్చింది. అమితాబ్ బచ్చన్, కళ్యాణ్ జ్యువెలర్స్తో సినీ టీవీ రంగాల్లో పనిచేస్తున్న రోజూవారి కార్మికులకు సాయమందిస్తున్నారు.