'అఖండ విజయోత్సవ జాతర' ఈ రాత్రికే, గెస్ట్ లు ఎవరంటే..

By Surya PrakashFirst Published Dec 9, 2021, 7:59 AM IST
Highlights

  ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని వుడా పార్క్​ ఎమ్​జీఎమ్​ గ్రౌండ్స్​లో గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్​ ప్రారంభం కానుంది. 

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తీసిన లేటెస్ట్ సినిమా అఖండ వారం క్రితం థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ సంస్థ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. బాలయ్య ఫ్యాన్స్, అలానే తెలుగు ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పరిచిన అఖండ అదే  స్థాయిలో సక్సెస్ అందుకుంది. గతంలో బాలయ్య తో బోయపాటి శ్రీను తీసిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి సూపర్ హిట్ కొట్టడంతో అఖండ కూడా సూపర్ హిట్ కొట్టి వారి కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేస్తుందని అందరూ భావించారు. అదే నిజమైంది. ఈ నేపధ్యంలో 'అఖండ విజయోత్సవ జాతర' పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్​ నిర్వహణకు చిత్రటీమ్  సిద్ధమైంది. 

విజయోత్సవ వేడుకని రేపు విశాఖపట్నంలోని ఎం జి ఎం గ్రౌండ్స్ ఉడా పార్క్ వద్ద నిర్వహించనుంది యూనిట్. ఇప్పటికే అక్కడ వేడుకకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితం దర్శకుడు బోయపాటి, హీరో బాలయ్య విశాఖ చేరుకోగా  ఈ రోజు రాత్రి సినిమాకి సంబందించిన ఇతర యూనిట్ సభ్యులు కూడా అక్కడికి చేరుకోనుండగా, ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  

అయితే ఈ వేడుకకు సూపర్​స్టార్ మహేశ్​బాబు, యంగ్​టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.పూర్తి మాస్ కథతో తెరకెక్కిన 'అఖండ'.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రైతుగా, అఘోరాగా ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. అదరగొట్టేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు.  

Also read Akhanda:‘అఖండ’కు సీక్వెల్‌ , అవన్నీ చూపిస్తారట,వాళ్లలో భయం

 అఖండ సినిమాతో బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కొట్టారు. వీరి కాంబోను ఇష్టపడే వాళ్లంతా థియేటర్లలో సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు.. విదేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు అఖండ సినిమా చూసి అదిరిపోయే రివ్యూలిస్తున్నారు.  ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు.  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

Also read కల్లు గొప్పతనం చెప్పారు.. అఖండ డైరెక్టర్ ని కలిసిన గౌడ సంఘాలు

click me!