డబ్బు కోసం వేధిస్తున్నాడు.. స్టార్ కమెడియన్ పై ఆరోపణలు!

By AN TeluguFirst Published Jan 9, 2020, 10:05 AM IST
Highlights

శంకర్ నిర్మాతగా శింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి' సినిమా మంచి విజయాన్ని సాధించడంతో హీరోగా వడివేలుకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అదే కాంబినేషన్ లో 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2' సినిమాను తీయలనుకున్నారు.

హాస్యనటుడు వడివేలు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. అతడిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో వడివేలు పేరు వినిపించింది. వాటిలో ముఖ్యంగా 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2' చిత్ర వివాదం వార్తల్లో బాగా నిలిచింది.

శంకర్ నిర్మాతగా శింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి' సినిమా మంచి విజయాన్ని సాధించడంతో హీరోగా వడివేలుకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అదే కాంబినేషన్ లో 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2' సినిమాను తీయలనుకున్నారు. దీనికి సంబంధించిన కొంత షూటింగ్ కూడా జరిగింది. దానికోసం భారీ సెట్స్ కూడా వేశారు. అలాంటిది వడివేలు ఈ సినిమాలో నటించడానికి నిరాకరించారు.

సక్సెస్ రుచి చూడని అందాల భామలు

దీంతో నిర్మాత శంకర్ నష్టపరిహారంగా వడివేలు రూ.4కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవ ఇంకా పంచాయితీ దశలోనే ఉంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మదురై, పూదూర్ కి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి వడివేలుపై పూదూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. సతీష్ కుమార్ పూదూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈయన ఆఫీస్ లో గోవిందరాజ్ అనే వ్యక్తి నిర్వాహకుడిగా పని చేస్తున్నాడు.

అయితే ఇటీవల మణికంఠన్‌ అనే వ్యక్తి కొందరితో కలిసి సతీష్ కుమార్ ఆఫీస్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న గోవిందరాజ్ పై దాడికి పాల్పడ్డాడు. డబ్బు సెటిల్ చేయకపోతే గోవిందరాజ్ ని, సతీష్ కుమార్ ని నీటి ట్యాంకర్ తో గుద్ది చంపుతామని బెదిరించారు. సతీష్ కుమార్ గతంలో వడివేలు హీరోగా 'ఎలి' అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా.. వడివేలు వద్ద మేనేజర్ గా మణికంఠన్‌ పని చేస్తున్నాడు.

ఆ సినిమా లావాదేవీల్లో కారణంగానే నటుడు వడివేలు ప్రోద్బలంతో మణికంఠన్‌.. సతీష్ కుమార్ ని బెదిరించినట్లు తెలిసింది. దీంతో సతీష్ కుమార్ ఈ ఘటనపై పూదూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నటుడు వడివేలుని విచారించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.   

click me!