దుబాయ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం...

By Chinthakindhi RamuFirst Published Dec 31, 2022, 10:45 AM IST
Highlights

దుబాయ్‌లో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి...

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనను ముగించుకున్న విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మతో కలిసి నేరుగా దుబాయ్ చేరుకున్నాడు. అక్కడే ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఏకాంతంగా సాయంత్రాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ...

‘ఈ ఏడాదిలో చివరి సూర్యోదయం’ అంటూ  భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి సూర్యోదయాన్ని వీక్షిస్తూ కెమెరాలో బంధిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

భారత మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ రకంగా ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. గత ఏడాది చివర్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది ఆరంభంలో టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికారు. బీసీసీఐతో విభేదాల కారణంగా మొదటి సగంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా చర్చ జరిగింది...

అయితే రెండో సగంలో విరాట్ కోహ్లీ సంచలన ప్రదర్శనతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. టెస్టుల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోయినా వన్డే, టీ20ల్లో సెంచరీలు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్, ఈ ఏడాదిలోనే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌గా గుర్తింపు దక్కించుకుంది...

మూడేళ్ల గ్యాప్ తర్వాత 71వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్న విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సెంచరీ కూడా చేశాడు. 72 శతకాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే టెస్టుల్లో మాత్రం ఈ ఏడాది సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ.. 

శ్రీలంకతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కి ఎంపికైన విరాట్ కోహ్లీ, న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్‌లోనే ప్లాన్ చేశాడట. ఎక్కువ హడావుడి లేకుండా కూతురుతో కలిసి ఏకాంతంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని భావిస్తున్నారట విరుష్క జోడి... జనవరి 10 నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ లోపు స్వదేశానికి చేరుకుని, బీసీసీఐ క్యాంపులో కలవబోతున్నాడు విరాట్ కోహ్లీ.. 

కూతురి కోసం సినిమాల నుంచి ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క శర్మ, ఈ ఏడాది ‘ఖలా’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించింది. అలాగే భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’లోనూ నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది...

click me!