దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం: టీమిండియాపై సచిన్ ప్రశంసలు

By Siva KodatiFirst Published Oct 14, 2019, 6:04 PM IST
Highlights

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పుణే టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుసగా 11 సిరీస్ విజయాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. 

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పుణే టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

వరుసగా 11 సిరీస్ విజయాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ రికార్డు సాధించడానికి క్రికెటర్లు అద్భుతంగా రాణించారంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

కాగా.. పుణే టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 237 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం. 
 

Congratulations to on winning 11 series back to back at home! Incredible consistency shown by the boys to achieve this record. Well played. pic.twitter.com/9EBVjt95ll

— Sachin Tendulkar (@sachin_rt)
click me!