పూజారా ఆ పనిచేస్తే... సగం మీసం గీయించుకుంటా.. అశ్విన్ ఛాలెంజ్

By telugu news teamFirst Published Jan 26, 2021, 11:11 AM IST
Highlights

ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా బౌలింగ్ చేశారని, వారిని కామెంటేటర్ గా ఉన్న వార్న్ సైతం ప్రశంసించారని గుర్తు చేసుకుంటూ, తాను కూడా అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదని అన్నాడు.

త్వరలో టీమిండియా... ఇంగ్లాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. భారత్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పర్యటన నేపథ్యంలో...  క్రికెటర్లు మాటల యుద్ధం మొదలుపెట్టారు.

2018లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, సౌతాంప్టన్ లో మోయిన్ అలీ వికెట్లు తీసిన పిచ్ పై అశ్విన్ విఫలం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

తాజాగా నాటి ఘటనలపై అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా బౌలింగ్ చేశారని, వారిని కామెంటేటర్ గా ఉన్న వార్న్ సైతం ప్రశంసించారని గుర్తు చేసుకుంటూ, తాను కూడా అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదని అన్నాడు.

గత సిరీస్ లో అడిలైడ్ లో తన పొత్తి కడుపులో గాయమైనా, పట్టుదలగా ఆడానని, ఆరు వికెట్లు కూడా తీశానని గుర్తు చేసుకున్నాడు. అయినా, మ్యాచ్ తరువాత లయన్ బాగా బౌలింగ్ చేశాడని చెప్పుకున్నారని, ఇలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం తనను బాధించిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తన ఆలోచనలు వేరేగా ఉండనున్నాయని, ఇక మీదట లయన్ తో పోటీ పడటం కంటే, స్టీవ్ స్మిత్ తో పోటీపడతానని అన్నాడు.

ఇక ఇదే సమయంలో తన సహచర ఆటగాడు ఛటేశ్వర్ పుజారాకు అశ్విన్ ఓ సరదా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లు జరిగే సమయంలో మొయిన్ అలీ సహా మరే స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనైనా, పిచ్ పై ముందడుగు వేసి, బౌలర్ తలపై నుంచి భారీ షాట్ కొట్టాలని సవాల్ విసిరాడు. తన సవాల్ లో పుజారా విజయవంతమైతే, తాను సగం మీసం తీసేసి మరీ మ్యాచ్ ఆడతానని సరదాగా అన్నాడు.

click me!