ప్రో కబడ్డి 2019: వార్ వన్ సైడే.... బెంగాల్ చేతిలో పాట్నా చిత్తు

Published : Aug 22, 2019, 08:55 PM ISTUpdated : Aug 22, 2019, 09:07 PM IST
ప్రో కబడ్డి 2019: వార్ వన్ సైడే.... బెంగాల్ చేతిలో పాట్నా  చిత్తు

సారాంశం

చెన్నై వేదికన జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెెంగాల్ వారియర్స్ అదరగొట్టింది. వారియర్స్ ఆటగాళ్ల విజృంభణతో పాట్నా పేరేట్స్ తో జరిగిన మ్యాచ్ వార్ వన్ సైడ్ అయ్యింది.  

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో మరో రసవత్తర పోరుకు చెన్నైలోని జవహార్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికయ్యింది. బెంగాల్ వారియర్స్ దెబ్బకు పాట్నా పైరేట్స్ చిత్తయ్యింది. వారియర్స్ రైడర్స్, డిఫెండర్స్ సమిష్టిగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. పాట్నా స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. 

బెంగాల్ వారియర్స్ జట్టు రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 4 ఇలా మొత్తం 35 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో మణిందర్ 10 పాయింట్లతో చెలరేగగా  ప్రభంజన్ 6, రింకు 5, ఇస్మాయిల్ 4, జీవ కుమార్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక బల్దేవ్ 2, సుఖేష్ 1 పాయింట్ సాధించారు. ఇలా ఆటగాళ్లందరు సమిష్టిగా రాణించడంతో బెంగాల్ మరో విజయాన్ని అందుకుని పాయింట్స్ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 

పాట్నా పేరేట్స్ మాత్రం ఈ సీజన్లో మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ జట్టు రైడింగ్ లో 18 పాయింట్లతో బెంగాల్ కు మంచి పోటీనిచ్చిన ట్యాకిల్స్ విషయంలో తేలిపోయింది. డిఫెండర్స్ విఫలమవడంతో కేవలం 6 ట్యాకిల్ పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.  ఆలౌట్ ద్వారా  మరో 2 పాయింట్లు అందుకున్నా 26 పాయింట్లవద్దే ఆగిపోయింది. 

పైరేట్స్ ఆటగాళ్లలో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 ఒక్కడే అద్భుతంగా ఆడాడు. మిగతావారిలో ఎవరూ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో పాట్నా జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఇలా 35-26 పాయింట్ల తేడాతో పైరేట్స్ పై బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్