PBKS vs LSG IPL 2025: పంత్ టీమ్ కు మ‌రో షాక్.. ల‌క్నో పై పంజాబ్ గెలుపు

Published : May 04, 2025, 11:24 PM IST
PBKS vs LSG IPL 2025: పంత్ టీమ్ కు మ‌రో షాక్.. ల‌క్నో పై పంజాబ్ గెలుపు

సారాంశం

PBKS vs LSG IPL 2025: ఐపీఎల్ 2025 లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. బ్యాటింగ్ లో ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్య‌ర్, శ‌శాంక్ సింగ్ సూప‌ర్ నాక్ ల‌కు తోడుగా, బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, ఓమ‌ర్జాయ్ అద్భుత‌మైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ విక్ట‌రీ కొట్టింది.   

PBKS vs LSG IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 54వ మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఓడించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 15 పాయింట్ల‌తో పంజాబ్ టీమ్ రెండో స్థానంలోకి చేరింది. 

ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్య‌ర్, శ‌శాంక్ సింగ్ సూప‌ర్ బ్యాటింగ్ తో పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 236 ప‌రుగులు చేసింది. 


ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ 91 ప‌రుగుల సూప‌ర్ నాక్ ఆడాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. శ్రేయాస్ అయ్య‌ర్ 45 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. చివ‌ర‌లో శాశాంక్ సింగ్ 33 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ ఇంగ్లీస్ 30 ప‌రుగులు చేశాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్లు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. 

237 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రిష‌బ్ పంత్ టీమ్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టాపార్డ‌ర్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. దీంతో పంజాబ్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ చేతిలో ల‌క్నో టీమ్ 37 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది