ఫొటోను చూసిన జీవా తండ్రి వద్దకు వచ్చి.. ఎందుకు అతడు నా గ్లాసెస్ పెట్టుకున్నాడు అని అడిగిందట. ఆ తరువాత తన రూమ్లోకి వెళ్లి గ్లాసెస్ చూసుకొని.. నావి నా దగ్గరే ఉన్నాయిలే అని చెప్పిందట. ఈ విషయాన్ని ధోనీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు..
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా ధోనీని కాపీ కొట్టాడు. అది ముందుగా జీవానే గుర్తించింది. అంతేకాదు.. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి... రణ్ వీర్ పై ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ధోనీ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.
ఇంతకీ మ్యాటరేంటంటే.... బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ ఎవరూ అనగానే వెంటనే అందరూ రణవీర్ పేరు చెబుతారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త రకం డిజైన్లను రణవీర్ పరిచయం చేస్తూ ఉంటాడు. తాజాగా... కొత్త రకం కళ్లజోడు పెట్టుకొని రణవీర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అచ్చం అలాంటి కళ్ల జోడు ధోనీ కుమార్తె జీవా దగ్గర కూడా ఉంది. జీవా కూడా అలాంటి కళ్లజోడు పెట్టుకొని ఫోటో దిగింది.
అయితే... ఫొటోను చూసిన జీవా తండ్రి వద్దకు వచ్చి.. ఎందుకు అతడు నా గ్లాసెస్ పెట్టుకున్నాడు అని అడిగిందట. ఆ తరువాత తన రూమ్లోకి వెళ్లి గ్లాసెస్ చూసుకొని.. నావి నా దగ్గరే ఉన్నాయిలే అని చెప్పిందట. ఈ విషయాన్ని ధోనీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు..
జీవా, రణవీర్ లు ఒకేలాంటి కళ్లజోడు పెట్టుకున్న ఫోటోలను పోస్టు చేసి.. ‘‘ఇప్పటికాలంలో పిల్లలు ముదుర్లుగా తయారయ్యారు. నాలుగున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను నేను కనీసం గుర్తించలేదు. ఎప్పుడైనా జీవా ధోనిని రణ్వీర్ను కలిస్తే.. నీలాంటి గ్లాసెస్ నా దగ్గర కూడా ఉన్నాయి అని కచ్చితంగా చెప్తుంది’’ అని ట్వీట్ చేశాడు. దానికి రణ్వీర్.. హా హా హా హా ఫ్యాషన్ ఇష్టా అని కామెంట్ పెట్టాడు.