పాండ్యాకూ ఫైన్ పడింది.. కెప్టెన్ల జేబులకు చిల్లు.. అసలేంటి స్లో ఓవర్ రేట్ నిబంధన..?

Published : Apr 14, 2023, 02:23 PM IST
పాండ్యాకూ ఫైన్ పడింది.. కెప్టెన్ల జేబులకు చిల్లు.. అసలేంటి స్లో ఓవర్ రేట్ నిబంధన..?

సారాంశం

IPL 2023: ఐపీఎల్ -16లో  సారథులకు  జరిమానాలు  షాకిస్తున్నాయి.  ఈ సీజన్ లో ఇప్పటికి 20 మ్యాచ్ లు కూడా  ముగియకముందే  ఇప్పటికే ముగ్గురు  కెప్టెన్లు ఫైన్ లు ఎదుర్కున్నారు. 

ఐపీఎల్ - 2023 సీజన్ లో కెప్టెన్లకు కొత్త తలనొప్పి పట్టుకుంది.  గడిచిన వారం రోజుల్లో ముగ్గురు సారథులకు  ఐపీఎల్ నియమావళి  షాకిచ్చింది.   ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, రాజస్తాన్ కెప్టెన్  సంజూ శాంసన్ తో పాటు  గుజరాత్ టైటాన్స్ సారథి  హార్ధిక్ పాండ్యాలు  జరిమానాల బారిన పడ్డారు.   వీరిలో  హార్ధిక్, శాంసన్ లు మ్యాచ్ గెలిచినా ఫైన్ లు కడితే డుప్లెసిస్ మ్యాచ్ పోయిన బాధలో కూడా జరిమానా కట్టాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం స్లో ఓవర్ రేట్. 

పంజాబ్ - గుజరాత్ మధ్య  గురువారం  మొహాలీ వేదికగా ముగిసిన  ఐపీఎల్ 18వ లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ ఇన్నింగ్స్ లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను  హార్ధిక్ పాండ్యాకు  రూ.   12 లక్షల జరిమానా పడింది.   పాండ్యా కంటే ముందు  డుప్లెసిస్,  శాంసన్ లు కూడా  జరిమానా బాధితులే. 

అసలేంటి స్లో ఓవర్ రేట్ రూల్.. 

క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్   క్రికెట్ క్లబ్  వెలువరించిన  నిబంధనాల మేరకు.. ఓవర్ రేట్ అనేది ఒక గంట ఆటలో  ఫీల్గింగ్ సైడ్  బౌలింగ్ చేసే సగటు ఓవర్ల సంఖ్య.  ఐసీసీ నిబంధనల ప్రకారం   ఒక జట్టు టెస్టు క్రికెట్ లో  గంటకు సగటున 15 ఓవర్లు, వన్డేలలో 14.28 ఓవర్లు, టీ20లలో అయితే  14.11  ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయాలి.  వన్డేలలో ఒక జట్టు  (బౌలింగ్ చేసే) మూడున్నర గంటలలో ఇన్నింగ్స్ ను పూర్తి చేయాలి.  టీ20లలో  ఇది ఒక గంటా 25 నిమిషాలే. ఈ టైమ్ ను దాటితే  ఆయా జట్లు (టీమ్ కెప్టెన్) నిబంధనలు ఉల్లంఘించినట్టే లెక్క. దీనికి  తొలిసారి అయితే  జరిమానాలు, ఆ తర్వాత ఒక మ్యాచ్ నిషేధాలు కూడా ఉంటాయి. 

 

ఐపీఎల్ లో అయితే.. 

- ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ ప్రకారం  సీజన్ లో మొదటి తప్పిదానికి  సదరు  జట్టు సారథికి రూ. 12 లక్షల జరిమానా విధించబడుతుంది. 
- రెండోసారి ఇదే కంటిన్యూ అయితే కెప్టెన్ కు రూ. 24 లక్షల జరిమానా , ఆటగాళ్ల మ్యాచ్  ఫీజులో రూ. 6 లక్షల  లేదా 25 శాతం కోత విధించొచ్చు. 
- ఒక సీజన్ లో మూడో సారి కూడా ఈ తప్పు రిపీట్ అయితే  బౌలింగ్ చేసిన జట్టు కెప్టెన్ కు రూ. 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించబడుతుంది.  టీమ్ లోని ఇతర సభ్యులకు ఒక్కొక్కరికి  రూ. 12 లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో  50 శాతం జరిమానా  కూడా విధించొచ్చు.  

ఈ లెక్కల ప్రకారం  డుప్లెసిస్, శాంసన్, పాండ్యాలు  రెండో  ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉన్నారు.  మరి వాళ్లు తర్వాత మ్యాచ్ లలో  ఈ తప్పిదం  పునరావృతం కాకుండా చూసుకుంటారో లేదో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?