ఫన్నీ వాక్తో క్రిస్గేల్ను అనుకరించిన మహేంద్ర సింగ్ ధోనీ...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఫన్నీ సంఘటన...
IPL కారణంగా డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, క్రిస్గేల్ వంటి విదేశీ క్రికెటర్లకు కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్గేల్కి భారత జట్టులో కూడా స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ, క్రిస్ గేల్ మంచి స్నేహితులు. ఈ ఇద్దరు ఆజానుబాహులకి నడకలో, ఆహార్యంలో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ప్లేయర్లు అభివాదం చేసుకునే సమయంలో గేల్ను చూసిన మహేంద్ర సింగ్ ధోనీ... అతని వాకింగ్ స్టైల్ను అనుకరిస్తూ ట్రోల్ చేశాడు. గేల్ కూడా నవ్వుతూ ధోనీకి అభివాదం చేశాడు. గేల్ కూడా నవ్వుతూ మాహీకి విష్ చేసి, హగ్ ఇచ్చాడు.
Rare Moment 🕺😍.. pic.twitter.com/Nosc7lsMuS
— DhoniGifs ™ (@DhoniGifs)
హిట్టింగ్కి మారుపేరైన క్రిస్గేల్ ఇప్పటిదాకా ఈ సీజన్లో బ్యాటింగ్కి రాలేదు. గేల్ లేకుండా ఐదు మ్యాచులు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు మ్యాచుల్లో ఓడింది.