వార్నింగ్ ఇచ్చి మరీ కోహ్లీని ఔట్ చేసిన శ్రేయాస్ గోపాల్

By telugu teamFirst Published Apr 3, 2019, 3:11 PM IST
Highlights

శ్రేయాస్ గోపాల్ ముందస్తు హెచ్చరిక చేసి మరీ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. బెంగళూర్ ఇన్నింగ్సు 7వ ఓవరులో లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ చేస్తూ రెండో బంతిని గూగ్లీ వేశాడు. దాన్ని డిఫెన్స్ చేయడానికి కోహ్లీ చాలా శ్రమించాల్సి వచ్చింది.

బెంగళూరు: రాయల్ చాలెంజర్ బెంగళూరు (ఆర్సీబీ)పై మంగళవారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ అద్భుతంగా రాణించారు. అనిల్ కుంబ్లేను గుర్తు చేస్తూ అతను గుగ్లీ విసిరి బెంగళూర్ బ్యాట్స్ మెన్ ను ఆడుకున్నారు. అతని గూగ్లీకి బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బోల్తా కొట్టాడు.

శ్రేయాస్ గోపాల్ ముందస్తు హెచ్చరిక చేసి మరీ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. బెంగళూర్ ఇన్నింగ్సు 7వ ఓవరులో లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ చేస్తూ రెండో బంతిని గూగ్లీ వేశాడు. దాన్ని డిఫెన్స్ చేయడానికి కోహ్లీ చాలా శ్రమించాల్సి వచ్చింది. బంతి బ్యాట్ కొసకు తాకింది. ఎల్బీడబ్ల్యూకి రాజస్థాన్ రాయల్స్ అపీల్ చేస్తే అంపైర్ తిరస్కరించాడు 

అయితే, ఆ తర్వాత బంతికే కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. ఇంతకు ముందు వేసిననట్లే  ఆ తర్వాతి బంతిని కూడా శ్రేయాస్ గోపాల్ వేశాడు. డిఫెన్స్ చేద్దామని కోహ్లీ ప్రయత్నించాడు. అయితే, ఈ లోపే బంతి బ్యాడ్జ్ ను తాకుతూ వికెట్లను గిరాటేసింది. దాంతో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ రాయల్ చాలెంజర్ బెంగళూర్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

click me!