INDvsENG: టీమిండియా ఆలౌట్... మరోసారి వాషింగ్టన్ సుందర్ సెంచరీ మిస్...

Published : Feb 08, 2021, 11:21 AM IST
INDvsENG: టీమిండియా ఆలౌట్... మరోసారి వాషింగ్టన్ సుందర్ సెంచరీ మిస్...

సారాంశం

రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం... 138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సుందర్... తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... ఇంగ్లాండ్‌కి 241 పరుగుల ఆధిక్యం...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

91 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో కలిసి 31 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జాక్ లీచ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షాబర్ నదీమ్ డకౌట్, ఇశాంత్ శర్మ 4, బుమ్రా డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీలతో బ్యాటింగ్ కొనసాగించిన వాషింగ్టన్ సుందర్ 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సుందర్, సెంచరీని మిస్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్ నాలుగు వికెట్లు తీయగా, జాక్ లీచ్, అండర్సన్, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే