నాథన్ లియాన్‌కి భారత జట్టు స్పెషల్ గిఫ్ట్... జెర్సీ అందచేసిన కెప్టెన్ రహానే...

Published : Jan 19, 2021, 02:28 PM IST
నాథన్ లియాన్‌కి భారత జట్టు స్పెషల్ గిఫ్ట్... జెర్సీ అందచేసిన కెప్టెన్ రహానే...

సారాంశం

వందో టెస్టులో 3 వికెట్లు తీసిన నాథన్ లియాన్... గబ్బాలో భారత జట్టు చారిత్రక విజయంతో నిరాశకు లోనైన ఆస్ట్రేలియా క్రికెటర్లు... వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌కి జ్ఞాపిక అందచేసిన రహానే...

ప్రతీ క్రికెటర్‌కి కెరీర్‌లో వందో టెస్టు చాలా అపురూపం. అయితే భారత జట్టుతో కలిసి గబ్బాలో తన వందో టెస్టు ఆడిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌కి వందో టెస్టు మధురానుభూతులను మిగల్చలేకపోయింది. స్పిన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకునే భారత బ్యాట్స్‌మెన్, నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో ఈజీగా పరుగులు రాబట్టారు. 

ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో లియన్ ఓ వికెట్ దక్కగా, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు దక్కాయి. అయితే వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌కి జ్ఞాపకంగా భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన భారత జెర్సీని అందచేశాడు భారత కెప్టెన్ అజింకా రహానే.

మ్యాచ్ అనంతరం భారత జట్టు తరుపున ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రహానేకి నాథన్ లియాన్ కృతజ్ఞతలు తెలిపాడు. సిరీస్‌లో 21 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలవగా, రిషబ్ పంత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !