Published : Jul 05, 2025, 03:42 PM ISTUpdated : Jul 05, 2025, 11:25 PM IST

India vs England 2nd Test Day 4 Live: ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్

సారాంశం

India vs England, 2nd Test Day 4 Live: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు 4వ రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

11:25 PM (IST) Jul 05

ముగిసిన 4వ రోజు ఆట.. ఇంగ్లాండ్ 72/3 పరుగులు

నాల్గో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు 72/3 పరుగులతో ఆడుతోంది. గెలవడానికి ఇంకా 536 పరుగులు అవసరం. భారత్ 608 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్:

• హ్యారీ బ్రుక్: 15 పరుగులు

• ఓలీ పోప్: 24 పరుగులు

భారత బౌలర్లు:

• ఆకాష్ దీప్: 2 వికెట్లు

• మహ్మద్ సిరాజ్: 1 వికెట్

 

 

10:54 PM (IST) Jul 05

భారత్ దూకుడు.. ఇంగ్లాండ్ మూడో వికెట్ డౌన్.. జోరూట్ అవుట్

ఆకాశ్ దీప్ మరోసారి విజృంభించాడు. జో రూట్ ను 6 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది ఆకాశ్ దీప్‌కు ఇది రెండవ వికెట్.

ఇంగ్లాండ్ 50/3 పరుగులు, ఇంకా గెలవడానికి 558 పరుగులు కావాలి.

 

 

10:48 PM (IST) Jul 05

Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.

 

Read Full Story

10:02 PM (IST) Jul 05

శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర

Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. రికార్డుల మోత మోగించాడు.

 

Read Full Story

10:01 PM (IST) Jul 05

ఇంగ్లాండ్ భారీ టార్గెట్ ఉంచిన భారత్

భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ గెలవాలంటే 608 పరుగులు చేయాలి.

ఇండియా : 587 & 427/6 డిక్లేర్

 

09:27 PM (IST) Jul 05

శుభ్ మన్ గిల్ అవుట్

Shubman Gill:  సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసిన గిల్.. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

భారత: 418/6, ఇంగ్లాండ్‌పై లీడ్: 598 పరుగులు

జడేజా 66* పరుగులు

వాషింగ్టన్ సుందర్ 6*  పరుగులు

 

 

08:24 PM (IST) Jul 05

రికార్డుల మోత మోగిస్తన్న శుభ్‌మన్ గిల్

Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ (200+), సెంచరీ (100+) చేసిన అరుదైన ప్లేయర్ల లిస్టులో చేరాడు.

అలాగే, ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన భారత కెప్టెన్ల లిస్టులో చేరాడు

1. సునీల్ గావస్కర్ – vs వెస్టిండీస్, కోల్ కతా, 1978

2. విరాట్ కోహ్లీ – vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2014

3. షుభ్‌మన్ గిల్ – vs ఇంగ్లాండ్, ఎడ్జ్‌బాస్టన్, 2025

 

భారత: 304/4, ఇంగ్లాండ్‌పై లీడ్: 484 పరుగులు

గిల్ 100* పరుగులు

జడేజా 25* పరుగులు

08:20 PM (IST) Jul 05

సెంచరీ కొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన 8వ టెస్ట్ సెంచరీని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో పూర్తి చేశాడు. దీంతో ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ (200+), సెంచరీ (100+) చేసిన తొమ్మిదవ బ్యాట్స్‌మన్ గా ఘనత సాధించాడు.

భారతదేశ తరఫున ఈ రికార్డు సాధించిన రెండో ప్లేయర్. గిల్ కంటే ముందు సునీల్ గావస్కర్, 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టాడు.

 

 

 

07:00 PM (IST) Jul 05

రిషబ్ పంత్ అవుట్

India vs England 2nd Test Day 4 Live: భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుట్ అయ్యాడు.

రిషభ్ పంత్ కు ఇది 16వ హాఫ్ సెంచరీ. 63 పరుగుల ఇన్నింగ్స్ లో పంత్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

భారత: 242-4, ఇంగ్లాండ్‌పై లీడ్: 422 పరుగులు

గిల్ 63* పరుగులు

జడేజా 2*  పరుగులు

 

 

06:56 PM (IST) Jul 05

శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ

India vs England 2nd Test Day 4 Live: భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 57 బంతుల్లో ఈ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 50 పరుగులు పూర్తి చేసిన గిల్ భారత్ ను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు.

భారత: 212/3, ఇంగ్లాండ్‌పై లీడ్: 292 పరుగులు

05:43 PM (IST) Jul 05

ఎడ్జ్‌బాస్టన్ లో రిషబ్ పంత్ షో

IND vs ENG Live Score: నాల్గో రోజు ఆట ఒక థ్రిల్లర్ మూవీలా మారిపోయింది. సిక్సర్లు, ఫోర్లు, డ్రాప్ క్యాచ్‌లు, గాల్లోకి బ్యాట్.. ఇదంతా ఎడ్జ్‌బాస్టన్ లో జరగుతోంది.

పంత్ క్రీజులోకి వచ్చిన వెంటనే మ్యాచ్ మోమెంటం ఒక్కసారిగా మారింది. జోష్ టంగ్‌ బౌలింగ్ లో ఒక సూపర్ పుల్ షాట్‌తో బౌండరీ.. తర్వాత మరో సిక్సర్ తో స్టేడియం హోరెత్తిపోయింది.

ఆ తర్వాత బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో పాంత్ ముందుకొచ్చి షాట్ ఆడాడు. బాల్ స్ట్రెయిట్‌గా మిడ్-ఆఫ్‌ వద్ద జాక్ క్రాలీ క్యాచ్ మిస్ చేశాడు.

భారత్ 177/3

రిషబ్ పంత్ 41* పరుగులు

శుభ్ మన్ గిల్  24* పరుగులు 

 

 

05:19 PM (IST) Jul 05

కేఎల్ రాహుల్ అటాకింగ్ స్టార్ట్

IND vs ENG Live Score: కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విశ్లేషణ గమనిస్తే.. 3వ రోజు, 3వ సెషన్ లో 28 పరుగులు చేశాడు. ఇందులో ఫాల్స్ షాట్లు రెండు ఆడాడు. 4వ రోజు మొదటి సెషన్ లో 27 పరుగులు చేశాడు. ఇక్కడ ఏకంగా 10 ఫాల్స్ షాట్స్ ఆడాడు.

కేఎల్ రాహుల్ మొదట మంచి కంట్రోల్‌తో ఆడాడు. మూడో రోజు కేవలం రెండు తప్పు షాట్లు మాత్రమే ఆడాడు. కానీ, నాల్గవ రోజు ఉదయం మాత్రం చాలా తప్పుడు షాట్లతో ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. 46 బంతుల్లో 10 తప్పు షాట్లు అంటే దాదాపు ప్రతి 5 బంతుల్లో ఒక ఫాల్స్ షాట్ ఆడాడు. మొత్తంగా అయితే, భారత్ కు విలువైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ను ఆడాడు.

05:09 PM (IST) Jul 05

కేఎల్ రాహుల్ ఔట్

IND vs ENG Live Score: భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. జోష్ టంగ్ బౌలింగ్‌ లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. 55 పరుగుల ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 10 ఫోర్లు బాదాడు.

భారత్ స్కోర్: 126/3

ఇంగ్లాండ్‌పై లీడ్: 306 పరుగులు

03:49 PM (IST) Jul 05

ఉత్కంఠగా ఇంగ్లాండ్ vs ఇండియా మ్యాచ్

India vs England 2nd Test Day 4 Live: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మూడవ రోజు, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శనతో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ పోరాటంతో సమంగా నిలిచింది.

సిరాజ్ మెరుపులు మెరిపిస్తూ, జో రూట్, బెన్ స్టోక్స్‌లను ఒకే ఓవర్లో ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను 84/5 వద్ద కష్టాల్లో పడేశాడు. అయితే, జేమీ స్మిత్, బ్రూక్ కలిసి 303 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యంతో మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చాడు.

స్మిత్ ధాటిగా ఆడి, 184* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను లంచ్‌కు ముందు కేవలం 80 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

హ్యారీ బ్రూక్ కూడా 158 పరుగులు చేయగా, రెండో న్యూ బాల్‌తో ఆకాశ్ దీప్ సక్సెస్ అయ్యాడు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ చివరి ఐదు వికెట్లను కేవలం 20 పరుగులకే కోల్పోయి 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6/70తో, ఆకాశ్ దీప్ 4/88 వికెట్లతో మెరిశారు. భారత్‌కు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

ఆ తర్వాత భారత్, స్టంప్స్ సమయానికి 64/1 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ ను జోష్ టంగ్ అవుట్ చేశాడు. దీంతో భారత్ కు మొత్తం 244 పరుగుల ఆధిక్యం లభించింది.


More Trending News