గబ్బా టెస్టు: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

By team teluguFirst Published Jan 19, 2021, 5:53 AM IST
Highlights

7 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ...

18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

విదేశాల్లో పేలవమైన రికార్డును కొనసాగించిన రోహిత్ శర్మ..

ఆస్ట్రేలియా టూర్‌లో ఆఖరి టెస్టు ఆఖరి రోజు భారీ ఆశలతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ స్కోరు 4/0 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో 7 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో టిమ్‌పైన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా వచ్చిన రోహిత్ శర్మ, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 129 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. మొదటి టెస్టులో 26, 52 పరుగులు చేయగా, రెండో టెస్టులో 44, 7 పరుగులకి అవుటై నిరాశపరిచాడు. 

విదేశాల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్ శర్మ, ఈ సిరీస్‌లో దాన్ని మెరుగుచేసుకుంటాడని అందరూ భావించారు. అయితే చివరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ హోదాలో బరిలో దిగిన రోహిత్, కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.

 

click me!