వాహనదారులపై మళ్ళీ ఇంధన భారం.. వరుసగా 3వ రోజు పెరిగిన పెట్రోల్ ధర..

By Sandra Ashok KumarFirst Published Aug 18, 2020, 1:53 PM IST
Highlights

దేశంలోని మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు మళ్ళీ  పెరిగాయి, మంగళవారం అంటే ఆగస్టు 18న పెట్రోల్ ధర ఢీల్లీలో లీటరుకు రూ.80.73 నుండి. 80.90కు, ముంబైలో రూ.87.45 నుండి రూ.87.58 కు పెరిగాయి. 

వరుసగా మూడవ రోజు మంగళవారం కూడా దేశంలోని మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు మళ్ళీ  పెరిగాయి, మంగళవారం అంటే ఆగస్టు 18న పెట్రోల్ ధర ఢీల్లీలో లీటరుకు రూ.80.73 నుండి. 80.90కు, ముంబైలో రూ.87.45 నుండి రూ.87.58 కు పెరిగినట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ - iocl.com తెలిపింది.

ఢిల్లీ  పెట్రోల్ ధర రూ.80,90,డీజిల్ ధర  రూ.73,56
కోలకతా పెట్రోల్ ధర రూ.82,43,డీజిల్ ధర  రూ. 77,06
ముంబై పెట్రోల్ ధర రూ.87, డీజిల్ ధర  రూ. 58 80,11
చెన్నై పెట్రోల్ ధర రూ.83,99, డీజిల్ ధర  రూ.78,86

also read మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. 70 వేలకు చేరిన వెండి.. ...

ముడి చమురు, విదేశీ మారక రేట్లు వంటి కారణాల వల్ల ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం అనే మూడు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు దేశంలో పెట్రోల్, డీజిల్ స్టేషన్లలో ఎక్కువ భాగం కలిగి ఉన్నాయి.

ఈ మూడు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి ధరలలో ఏవైనా సవరణలను ఉంటే అమలు చేస్తాయి. సోమవారం 1.3 శాతం లాభం సాధించిన బ్రెంట్ ముడి 6 సెంట్లు లేదా 0.1 శాతం తగ్గి బ్యారెల్ 4527 డాలర్లకు పడిపోయింది. యు.ఎస్ సెషన్ 8 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి బ్యారెల్ 42.81 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 2.1 శాతం పెరిగింది.  దేశ రాజధానిలో 17 పైసలు పెరగ్గా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.90, హైదరాబా‌‌‌ద్‌లో లీటర్‌కు రూ.84.07కి చేరింది. దాదాపు 50 రోజుల తర్వాత ఆదివారం 14 పైసలను పెట్రోల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి.

గత మూడు రోజుల్లో 47 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. కాగా, డీజిల్‌ ధరల్లో గత 20 రోజులుగా ఎలాంటి మార్పు కనిపించలేదు. కాగా, జూలై, ఆగస్టు  మధ్య ఎల్పీజీ గ్యాస్‌ ధరలు పెరిగాయి. వచ్చే అక్టోబర్‌ వరకు గ్యాస్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

click me!