PM Awas Yojana: పీఎం ఆవాస్ యోజన్ సబ్సిడీ డబ్బులు అందాయా, లేదా తెలియడం లేదా...అయితే ఇలా చెక్ చేసుకోండి...

Published : Mar 10, 2022, 03:55 PM ISTUpdated : Mar 10, 2022, 04:00 PM IST
PM Awas Yojana: పీఎం ఆవాస్ యోజన్ సబ్సిడీ డబ్బులు అందాయా, లేదా తెలియడం లేదా...అయితే ఇలా చెక్ చేసుకోండి...

సారాంశం

PM Awas Yojana: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సొంతిల్లు లేని కుటుంబాల కోసం పీఎం ఆవాస్ యోజన కింద సబ్సిడీ అందిస్తున్నాయి. పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకున్న వారికి కేంద్రం ప్రభుత్వం కేటగిరీల వారీగా సబ్సిడీ అందిస్తోంది. అయితే కొన్ని తప్పిదాల కారణంగా ఈ సబ్సిడీ లబ్ది దారులకు అందడం లేదు. దానికి కారణాలు ఏంటో చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని అనేక కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల సొంతింటి  కలను సాకారం చేసేందుకు  ప్రధాని నరేంద్ర మోదీ  ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేస్తే రూ.2.67 లక్షల సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది.

అయితే, ఈ పథకం అమలు కావాలంటే కొన్ని షరతులకు లోబడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తప్పిదాలతో ఈ సబ్సిడీ మొత్తం కుటుంబాలకు అందడం లేదు.  పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికీ ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు అందలేదు. అయితే సబ్సిడీ ఎందుకు  నిలిచిందో మనం తెలుసుకోవచ్చు. తద్వారా తప్పిదాలు చేయకుండా సబ్సిడీ పొందే వీలుంది. 

సబ్సిడీ ఎందుకు నిలిచిపోతుందో తెలుసుకుందాం...
దరఖాస్తు చేసేటప్పుడు ఫారమ్‌లో తప్పు సమాచారం నమోదు చేసిన సందర్భాల్లో చాలాసార్లు సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన షరతు ఏమిటంటే, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో, వారు మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. మీరు ఈ షరతును కనుక నెరవేర్చకపోతే, మీరు ప్రయోజనం పొందలేరు. అదే సమయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీని పొందడానికి, ప్రభుత్వం ఆదాయం ప్రకారం మూడు కేటగిరీలు చేసింది. ఇందులో సంవత్సరానికి రూ. 3 లక్షలు, సంవత్సరానికి రూ. 6 లక్షలు మరియు సంవత్సరానికి రూ. 12 లక్షల ఆదాయం అనే మూడు కేటగిరీలు సృష్టించారు.

దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకున్న కేటగిరీకి, అతని ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉంటే, అతని సబ్సిడీ నిలిపివేస్తారు. ఆధార్ సహా ఇతర పత్రాల్లో ఫారం నింపడంలో తప్పులు దొర్లినా సబ్సిడీ అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. 

సబ్సిడీ ఎందుకు నిలిచిపోయిందో ఎలా తనిఖీ చేసుకోవాలి..
ముందుగా, మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in/ని సందర్శించాలి. దీని తర్వాత మీరు 'సెర్చ్ బెనిఫెషియరీ' ( Search Benefeciary)ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత సెర్చ్ బై నేమ్ (Search By Name) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ పేరును ఇక్కడ నమోదు చేయాలి. దీని తర్వాత, మీ పేరుతో సమానంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులందరి జాబితా కనిపిస్తుంది. మీరు ఈ జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!