
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఆర్థిక ప్రపంచాన్ని అమెరికా కరెన్సీ డాలర్ శాసించింది. అయితే ఇటీవలి కాలంలో ఆర్థిక ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గుతోందనడంలో సందేహం లేదు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలే ఇందుకు కారణం. రష్యాపై ఆర్థిక ఆంక్షలు కూడా డాలర్ను దెబ్బతీశాయి. భారత్తో సహా కొన్ని దేశాలు అంతర్జాతీయ లావాదేవీల కోసం డాలర్కు బదులుగా ఇతర కరెన్సీలను ఉపయోగించడం ప్రారంభించాయి. ఇది భవిష్యత్తులో డాలర్ దాని ప్రపంచ కరెన్సీ స్థానం నుండి పడిపోతుందా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనా సహా కొన్ని దేశాలకు రష్యా ముడిచమురు సరఫరా చేస్తోంది. ఈ లావాదేవీల చెల్లింపులు డాలర్లు కాకుండా ఇతర కరెన్సీలలో చేస్తున్నారు. భారత్ , చైనా మాత్రమే కాదు, అర్జెంటీనా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య దేశాలు సైతం డాలర్ బదులుగా ఇతర కరెన్సీల్లో చెల్లింపులు జరుపుతున్నాయి.
రష్యాకు డాలర్లలో చెల్లించని భారత్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై నాటో దేశాలు ఆంక్షలు విధించినా.. రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకోవడం మాత్రం భారత్ ఆపడం లేదు. దీంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న రష్యా, భారత్కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించింది. పాశ్చాత్య ఆంక్షల కారణంగా, రష్యా ముడి చమురు కోసం భారత్ డాలర్లు కాకుండా ఇతర కరెన్సీలలో చెల్లిస్తోంది. భారత్ UAE కరెన్సీ దిర్హామ్ , రష్యన్ కరెన్సీ రూబుల్లో చెల్లిస్తోంది. గత మూడు నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం బిలియన్ డాలర్లు దాటింది. ఇది సహజంగానే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్పై ప్రభావం చూపింది.
డాలర్ ఆధిపత్యం తగ్గుతోందా?
కాబట్టి ప్రపంచ లావాదేవీ కరెన్సీగా డాలర్ తన స్థానాన్ని కోల్పోతుందా? సమీప భవిష్యత్తులో అలాంటి అవకాశం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం , వ్యాపారంలో డాలర్ అత్యంత ముఖ్యమైన కరెన్సీ అని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని మరే ఇతర కరెన్సీ ఆక్రమించడం కష్టమని అన్నారు. అయితే, చాలా దేశాలు డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో ట్రేడింగ్ ప్రారంభిస్తే, డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్ లోనే డాలర్ మెల్లమెల్లగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వల్లో దాదాపు 60 శాతం డాలర్లలోనే ఉన్నాయి. అయితే, ఈ రేటు 2000లో 70%. అంటే 10% క్షీణత. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో పెరిగింది. యూరో 18% నుంచి దాదాపు 20% కి పెరిగింది.
డాలర్ పతనమైతే భారత్కు ఏం లాభం?
సహజంగానే డాలర్ విలువ పడిపోవడంతో రూపాయి విలువ పెరుగుతుంది. దీంతో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. అలాగే కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గుతుంది. ఇది దిగుమతి చేసుకున్న వస్తువుల ధరను కూడా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చాలా లావాదేవీలు డాలర్లలో జరుగుతాయి కాబట్టి, విలువ పడిపోయినప్పుడు, దిగుమతి చేసుకున్న వస్తువుల ధర కూడా పడిపోతుంది.