
భారత స్టాక్ మార్కెట్ (Stock Market)లు అంతర్జాతీయ మార్కెట్లు ఇస్తున్న ఊపుతో ఈరోజు అన్ని అంచనాలను అధిగమించి సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మార్కును దాటేసింది. వారం ప్రారంభమైన సోమవారం ఉదయం నుంచే ట్రేడింగ్ మంచి జోరుగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 59,764 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 139 పాయింట్ల లాభంతో 17,809 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీని కారణంగా సెన్సెక్స్ మళ్లీ 60 వేల మార్కును దాటడంలో విజయవంతమైంది.
ఉదయం 10.05 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 1,505 పాయింట్లు లాభపడి 60,781 వద్ద, నిఫ్టీ 403 పాయింట్లు లాభపడి 18,073 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రెండు ఎక్స్ఛేంజీలపై విపరీతంగా కొనుగోళ్లకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది
నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలలో అద్భుతమైన కొనుగోళ్ల సందడి కనిపిస్తోంి. బ్యాంకింగ్, విద్యుత్ రంగంలో 1 నుంచి 2 శాతం జంప్ ఉంది. నిఫ్టీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్లలో 2 శాతం లాభపడింది. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్లు కూడా 1 శాతం చొప్పున పెరిగాయి.
హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంకులు 8 శాతం పెరిగాయి
నేటి టాప్ 30 సెన్సెక్స్ స్టాక్లలో, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8, 7 శా చొప్పునతం భారీ జంప్ను చూపించాయి. ఇది కాకుండా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టెక్ ఎమ్, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్ కూడా బూమ్ను చూస్తున్నాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్లు కూడా 1 శాతం వరకు లాభపడ్డాయి.
అంతకుముందు, ప్రీ-ఓపెనింగ్ సెషన్లోనే, మార్కెట్ అప్ట్రెండ్ను సూచించింది. ప్రీ-ఓపెనింగ్లో సెన్సెక్స్ 353.09 పాయింట్లు లాభపడి 59,630కి చేరుకోగా, నిఫ్టీ 33.70 పాయింట్ల లాభంతో 17,637 వద్ద ట్రేడవుతోంది.
ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది
ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు సోమవారం రెడ్ మార్క్తో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో 0.15 శాతం నష్టపోయాయి. ఇది భారతీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్పై అత్యధిక ప్రభావం చూపుతుంది. అలాగే జపాన్కు చెందిన నిక్కీపై 0.02 శాతం, దక్షిణ కొరియా కోస్పిపై 0.29 శాతం పెరుగుదల ఉంది.