StockMarket Crash: పడిపోయిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా బ్రేక్.. ఇన్వెస్టర్లకు కంటతడి

Ashok Kumar   | Asianet News
Published : May 19, 2022, 02:24 PM ISTUpdated : May 19, 2022, 03:07 PM IST
StockMarket Crash: పడిపోయిన స్టాక్ మార్కెట్..  సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా బ్రేక్.. ఇన్వెస్టర్లకు కంటతడి

సారాంశం

నేడు గురువారం ఉదయం సెన్సెక్స్ ఇండెక్స్ 900 పాయింట్లు (1.66 శాతం) పడిపోయి 53,308 వద్ద ప్రారంభమైంది, నిఫ్టీ ఇండెక్స్ 269 పాయింట్లు పడిపోయి మరోసారి 16000 దిగువకు చేరుకొని 15,971 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 1027 పాయింట్ల పతనంతో ట్రేడవుతోంది.  

అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ గురువారం ప్రారంభమైన వెంటనే వారంలో నాల్గవ రోజున పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 900 పాయింట్లు (1.66 శాతం) నష్టపోయి 53,308 వద్ద ప్రారంభమైంది, అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 269 పాయింట్లు  పడిపోయి మరోసారి 16000 దిగువకు చేరి 15,971 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1027 పాయింట్ల పతనంతో ట్రేడవుతోంది.

స్టాక్ మార్కెట్ ప్రారంభంలో  
షేర్ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు ఒక్కసారిగా నష్టపోయారు. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం రూ.2,55,77,445.81 కోట్లుగా ఉండగా, ఈరోజు మార్కెట్ ప్రారంభంలో పతనం తర్వాత రూ.2,50,96,555.12 కోట్లకు తగ్గింది. అంటే ఇందులో దాదాపు రూ.4.80 లక్షల కోట్ల మేర క్షీణించింది. 

ఈ పతనం మధ్య సెన్సెక్స్‌లో లీస్టయిన  30 కంపెనీలలో 29 రెడ్ మార్క్‌లో  ఉన్నాయి. భారీ పతనం ఉన్నప్పటికీ, ITC లిమిటెడ్ స్టాక్ గురువారం నాడు అప్‌స్వింగ్‌లో ఉంది అలాగే 1.5 శాతం లాభపడి మూడేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నుపిన్ స్టాక్ తొమ్మిది శాతం పడిపోయి రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. 

బుధవారం రెడ్ మార్క్‌లో 
స్టాక్ మార్కెట్  రెండు సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి, అయితే ఒక రోజు అస్థిర ట్రేడింగ్ తర్వాత చివరకు పతనంతో రెడ్ మార్క్‌లో ముగిసింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 54,208 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 19 పాయింట్లు జారి 16,240 వద్ద ముగిశాయి. 

విదేశీ మార్కెట్లలో కూడా గందరగోళం 
గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా కనిపిస్తోంది. బుధవారం నాడు డౌ జోన్స్ 1,164.52 పాయింట్లు లేదా 3.57% క్షీణించి 31,490.07 వద్ద ముగిసింది.  నాస్‌డాక్ కూడా 4.73 శాతం లేదా 566 పాయింట్లు డైవ్ చేయడం ద్వారా 11428 స్థాయికి దిగజారింది. అంతేకాకుండా S&P కూడా 4.04 శాతం లేదా 165 పాయింట్ల నష్టంతో 3923 స్థాయి వద్ద ముగిసింది. నివేదిక ప్రకారం, వాల్ స్ట్రీట్ రెండేళ్లలో అతిపెద్ద వన్డే పతనాన్ని చవిచూసింది.
 

PREV
click me!

Recommended Stories

Gold : ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Today Gold Rate in Hyderabad: బంగారం రేట్లు ఢమాల్...ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?