ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో రుణ పునర్‌వ్యవస్థీకరణ పోర్టల్‌ ప్రారంభం..

Published : Sep 22, 2020, 10:18 AM ISTUpdated : Sep 22, 2020, 11:04 PM IST
ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో రుణ పునర్‌వ్యవస్థీకరణ పోర్టల్‌ ప్రారంభం..

సారాంశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకం కింద రుణ పునర్‌వ్యవస్థీకరణ  అర్హతను చెక్ చేయడానికి రిటైల్ కస్టమర్లకు వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకం కింద రుణ పునర్‌వ్యవస్థీకరణ  అర్హతను చెక్ చేయడానికి రిటైల్ కస్టమర్లకు వీలుగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

ఎస్‌బి‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్.శెట్టి మీడియాతో  మాట్లాడుతూ రిటైల్ కస్టమర్లకు 1-24 నెలల తాత్కాలిక ఎంచుకోవడానికి, రుణాలను తిరిగి షెడ్యూల్ చేయడానికి ఆప్షన్  అందిస్తారు. పునర్‌వ్యవస్థీకరణ అర్హత గురించి తెలుసుకునేందుకు కస్టమర్లు బ్యాంకుకు వెళ్లడానికి బదులుగా ఆన్‌లైన్‌లోనే ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

also read ఎయిర్ ఇండియాకు మరోసారి కరోనా షాక్.. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో.. ...

అర్హత కలిగిన కస్టమర్లు తర్వాత పేపర్లపై సంతకాలు చేసేందుకు బ్యాంకుకు వెళితే సరిపోతుందన్నారు. దాదాపు 3,500 మంది రిటైల్ కస్టమర్లు పోర్టల్‌ను యాక్సెస్ చేశారని, 111 మంది వినియోగదారులు పునర్నిర్మాణానికి అర్హులని శెట్టి తెలిపారు.

పునర్నిర్మాణం పొందే రుణగ్రహీతలకు ఇతర కస్టమర్ల కంటే 0.35% శాతం వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పునర్నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 డిసెంబర్ 2020.రుణగ్రహీతలు డిసెంబర్ 31 లోపు మంజూరు చేసిన ప్రణాళికను పొందవలసి ఉంటుంది.

రుణదాత 90 రోజుల్లోపు దానిని అమలు చేయాలి. ఈ పథకం కింద, బ్యాంకులు చెల్లింపులను రీ షెడ్యూల్ చేయవచ్చు, వడ్డీని మరొక క్రెడిట్ సదుపాయంగా మార్చవచ్చు, రెండేళ్ల వరకు తాత్కాలిక నిషేధాన్ని అందించవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

ప‌నికి రాని పాత డ్ర‌మ్ముల‌తో ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.. ఉన్న ఊరిలోనే బెస్ట్ బిజినెస్‌
Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో