వరుసగా 3వ రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. నేడు 10 గ్రాములకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Nov 06, 2020, 06:07 PM ISTUpdated : Nov 06, 2020, 10:35 PM IST
వరుసగా 3వ రోజు కూడా పెరిగిన బంగారం  ధరలు.. నేడు 10 గ్రాములకు ఎంతంటే ?

సారాంశం

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం ప్రపంచ విలువైన లోహల ధరల పెరుగుదల కారణంగా బంగారు ధరలు శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ.791 పెరిగి రూ.51,717కు చేరుకున్నాయి. 

నేడు వరుసగా మూడవ రోజు కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం ప్రపంచ విలువైన లోహల ధరల పెరుగుదల కారణంగా బంగారు ధరలు శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ.791 పెరిగి రూ.51,717కు చేరుకున్నాయి.

అంతకుముందు ట్రేడింగ్ రోజున వెండి ధర కిలోకు రూ.62,431తో పోలిస్తే నేడు వెండి ధర రూ.2,147 పెరిగి కిలోకు రూ.64,578 కు చేరింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పెరుగుదల కారణంగా రూపాయి విలువ శుక్రవారం డాలర్‌తో  పోలిస్తే 28 పైసలు పెరిగి 74.08 (తాత్కాలిక) వద్ద ముగిసింది.

also read పండగ సీజన్ ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి బ్యాంకింగ్ మోసాల గురించి తెలుసుకోండి.. ...

స్టాక్ మార్కెట్లో పెరుగుదల, డాలర్ బలహీనత, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధిస్తారనే ఆశల వల్ల స్థానిక కరెన్సీకి సపోర్ట్ లభించిందని వ్యాపారులు తెలిపారు.

ప్రపంచ బంగారు మండలి నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 653 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని దీంతో బంగారం నిల్వలో భారతదేశం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇది మొత్తం విదేశీ మారక నిల్వలలో 7.4 శాతం.

చైనా తరువాత భారతదేశం అత్యాదికంగా బంగారం కొనుగోలు చేసే దేశాలలో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో బంగారం దిగుమతి ఆగస్టులో 3.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో 1.36 బిలియన్ డాలర్లు మాత్రమే. భారతదేశంలో బంగారంపై  12.5 శాతం దిగుమతి సుంకాన్ని, మూడు శాతం జీఎస్టీ ఉంది.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్