Share Market News: జోష్ తో ప్రారంభమైన బి‌ఎస్‌ఈ సెన్సెక్స్.. మళ్లీ 15,400 దాటిన నిఫ్టీ..

Ashok Kumar   | Asianet News
Published : Jun 21, 2022, 11:49 AM IST
Share Market News: జోష్ తో ప్రారంభమైన  బి‌ఎస్‌ఈ సెన్సెక్స్..  మళ్లీ 15,400 దాటిన నిఫ్టీ..

సారాంశం

ఓపెనింగ్ సెషన్‌లో 1240 షేర్ల ధర పెరగగా, 444 తగ్గాయి. 86 ధరలు ప్రభావితం కాలేదు. ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

నేడు మంగళవారం స్టాక్ మార్కెట్ మంచి జోష్ తో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 405.99 పాయింట్ల కరెక్షన్‌తో 52003.83 వద్ద, NSE నిఫ్టీ కూడా 117.30 పాయింట్లు పెరిగి 15467.50 వద్ద ప్రారంభమైంది. 

ఓపెనింగ్ సెషన్‌లో 1240 షేర్ల ధర పెరగగా, 444 షేర్ల ధర తగ్గాయి. 86 షేర్ల ధరలు ఎలాంటి ప్రభావితం కాలేదు. ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభాలతో ప్రారంభం కాగా, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీలు ఒత్తిడిలో ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా జోరుతో ప్రారంభమయ్యాయి. అవి ఒక శాతం పెరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం క్యాపిటల్ మార్కెట్‌లో భారీగా విక్రయించారు. 1,217.12 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 

రూపాయి మరింత జారిపోయి డాలర్ 78కి చేరుకుంది, 
మరోవైపు, విదేశీ మారకద్రవ్యం మార్కెట్లో విదేశీ నిధుల నిరంతర ప్రవాహం ఇంకా ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు బలమైన డిమాండ్ కారణంగా పెట్టుబడిదారుల మనోభావాలు ప్రభావితమయ్యాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరు పైసలు తగ్గి 78.04 వద్ద ప్రారంభమైంది. నిన్నటితో పోలిస్తే రూపాయి ఆరు పైసలు బలహీనపడింది. సోమవారం, డాలర్ 77.98 వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే