కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై ఇంకా కొనసాగుతూనే ఉంది. నిర్మలా సీతారమన్ ఆర్థక శాఖ మంత్రి హయంలో తొలిసారి శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై ఇంకా కొనసాగుతూనే ఉంది. నిర్మలా సీతారమన్ ఆర్థక శాఖ మంత్రి హయంలో తొలిసారి శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే... ఈ బడ్జెట్ కారణంగా మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. అదే పతనం ఇంకా కొనసాగుతోంది.
బడ్జెట్ కారణంగా చాలామంది తమ షేర్లను అమ్మకాల్లో పెట్టారు. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం , ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా దీనికి ఒక కారణమైంది. సోమవారం ఉదయం నుంచే మార్కెట్లు కుప్పకూలాయి.
ఈ ఉదయం 400 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ ప్రస్తుతం 800 పాయింట్లకు పైగా దిగజారింది. ఈ రోజుని 2019లో మార్కెట్లకు అత్యంత చెత్త రోజుగా ట్రేడర్స్ చెబుతున్నారు. 2018 డిసెంబరు తర్వాత సెన్సెక్స్ ఇంత భారీగా నష్టోవడం మళ్లీ ఇప్పడే జరిగిందని వారు చెప్పారు.అటు నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది.