సంవత్ 2079 ఆరంభం అదుర్స్, ముహూరత్ ట్రేడింగ్ లో 525 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

Published : Oct 24, 2022, 08:44 PM IST
సంవత్ 2079 ఆరంభం అదుర్స్, ముహూరత్ ట్రేడింగ్ లో 525 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

సారాంశం

ముహూరత్ ట్రేడింగ్ రోజు మార్కెట్ లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 17700 పైన ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 524.51 పాయింట్లు, 0.88 శాతం లాభంతో 59,831.66 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 154.45 పాయింట్లు, 0.88 శాతం లాభంతో 17,730.75 వద్ద ముగిసింది.

సంవత్ 2079 మొదటి రోజు (ముహూరత్ ట్రేడింగ్) నిఫ్టీ 17,700 పైన ముగియడంతో బెంచ్‌మార్క్ సూచీలు బలమైన నోట్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 524.51 పాయింట్లు, 0.88% పెరిగి 59831.66 వద్ద, నిఫ్టీ 154.50 పాయింట్లు, 0.88% పెరిగి 17730.80 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, లార్సెన్ అండ్ టూబ్రో, ఎస్‌బిఐ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాప్ లూజర్స్ లో హెచ్‌యుఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి.

బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5-1 శాతం మేర పెరిగాయి. 

ముహూరత్  ట్రేడింగ్‌లో ప్రతి సెక్టార్ లోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. నిఫ్టీలో బ్యాంకు, ఆర్థిక సూచీలు దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ కూడా దాదాపు 1 శాతానికి చేరుకుంది. ఆటో, మెటల్, ఫార్మా సూచీలు దాదాపు 1 శాతం లాభపడ్డాయి. రియాల్టీ, ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ముగిశాయి. FMCG ఇండెక్స్ మాత్రమే రెడ్ మార్క్‌లో ముగిసింది. 

ప్రస్తుతం సెన్సెక్స్ 525 పాయింట్లు లాభపడి 59,831.66 వద్ద ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్ల వృద్ధితో 17731 వద్ద ముగిసింది. హెవీవెయిట్ స్టాక్స్‌లో కొనుగోళ్లు చోటు చేసుకోవడం,. సెన్సెక్స్ 30కి చెందిన 28 స్టాక్స్ గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్‌లో ICICIBANK, SBI, LT, HDFC, HDFCBANK, DRREDDY, INFY, NTPC, M&M ఉన్నాయి.

గత ఏడాది ముహూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్ ఎలా ఉంది
గతేడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌లో బలం పుంజుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడితే, నిఫ్టీ కూడా 17900 దాటిన తర్వాత ముగిసింది. సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 60079 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 88 పాయింట్ల లాభంతో 17917 స్థాయి వద్ద ముగిసింది. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ షేర్లలో మంచి కొనుగోళ్లు జరిగాయి. ముహూర్తపు ట్రేడింగ్‌లో, M&M, ITC, BAJAJ-AUTO, LT, KOTAKBANK అత్యధికంగా లాభపడ్డాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు
Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?