నేటి నుంచే చౌకగా ఎస్బీఐ హోం లోన్స్

Published : Apr 10, 2019, 12:22 PM ISTUpdated : Apr 10, 2019, 12:23 PM IST
నేటి నుంచే చౌకగా ఎస్బీఐ హోం లోన్స్

సారాంశం

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హోం లోన్స్‌పై వడ్డీరేటు నేటి నుంచి స్వల్పంగా తగ్గనుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేపో రేటును పావుశాతం తగ్గించడంతో.. ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్నాయి.

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హోం లోన్స్‌పై వడ్డీరేటు నేటి నుంచి స్వల్పంగా తగ్గనుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేపో రేటును పావుశాతం తగ్గించడంతో.. ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను 0.05శాతం తగ్గించింది. ఏప్రిల్ 10 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

రూ. 30లక్షల వరకూ గృహ రుణంపై వడ్డీ రేటు 10బేసిస్ పాయింట్లు(0.10) తగ్గించడంతో ఈ రేటు శ్రేణి 8.70-9శాతం నుంచి 8.60-8.90శాతానికి చేరుకుంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులు హోం లోన్ రుణాలు చౌకగా పొందే అవకాశం ఏర్పడింది.

కాగా, ఆర్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దిశలో తీసుకున్న మూడవ బ్యాంక్ ఎస్బీఐ కావడం గమనార్హం. ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం)లు 0.05శాతం కాల పరిమితి రుణ రేటును తగ్గించాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్