Reliance-Sanmina: ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం కోసం Sanmina Corporationతో చేతులు కలిపిన రిలయన్స్

Published : Mar 03, 2022, 11:39 AM IST
Reliance-Sanmina: ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం కోసం Sanmina Corporationతో చేతులు కలిపిన రిలయన్స్

సారాంశం

భారతదేశంలో ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి సన్మిన కార్పొరేషన్ (Sanmina Corporation)తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా కమ్యూనికేషన్స్ నెట్‌వర్కింగ్ , 5G, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైపర్‌స్కేల్ డేటాసెంటర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ అండ్ క్లీన్‌టెక్ , డిఫెన్స్ మార్కెట్‌లకు ఉపయోగపడతాయని ఫైలింగ్‌లో పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) పూర్తి అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (RSBVL), భారతదేశంలో ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి సన్మిన కార్పొరేషన్ (Sanmina Corporation)తో చేతులు కలిపింది. 

ఈ ఒప్పందం ప్రకారం, జాయింట్ వెంచర్ యూనిట్‌లో RSBVL 50.1% ఈక్విటీ వాటాను కలిగి ఉంటుంది, మిగిలిన 49.9% సన్మీనా (Sanmina)కలిగి ఉంటుంది, RIL మార్చి 3 నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. RSBVL ఈ వాటాను కొనుగోలు చేయడానికి సన్మీనా (Sanmina), ప్రస్తుత భారతదేశ యూనిట్ , షేర్లలో రూ. 1,670 కోట్లు పెట్టుబడి పెడుతుంది, అయితే సన్మీనా దాని ప్రస్తుత కాంట్రాక్ట్ తయారీ వ్యాపారానికి సహకరిస్తుంది. ఈ లావాదేవీలు సంప్రదాయ ముగింపు షరతులు , రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటాయి. ఈ లావాదేవీలు సెప్టెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని ఆర్‌ఐఎల్ తెలిపింది.

రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, "భారతదేశంలో హైటెక్ పరికరాల తయారీకి కీలకమైన మార్కెట్‌ను చేరుకోవడానికి సన్మీనా (Sanmina)తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. వృద్ధి , భద్రత రెండింటిలోనూ మన దేశానికి మరింత స్వావలంబన అవసరమని, అందుకే టెలికాం, IT, డేటా సెంటర్, క్లౌడ్, 5G, న్యూ ఎనర్జీ , ఇతర పరిశ్రమలలో ఎలక్ట్రానిక్స్ తయారీ కొత్త డిజిటల్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్నామని తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా మేము భారతీయ , ప్రపంచ డిమాండ్‌ను అందుకోగలుగుతాము. భారతదేశంలో ఇన్నోవేషన్ , ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రణాళికలు వేస్తూనే, తమ వ్యాపార భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. 

ఆయిల్ నుండి టెలికమ్యూనికేషన్స్ వరకు నిర్వహించే ఆయిల్-టు-టెలికాం సమ్మేళనం, ఈ జాయింట్ వెంచర్ ద్వారా కమ్యూనికేషన్స్ నెట్‌వర్కింగ్ , 5G, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైపర్‌స్కేల్ డేటాసెంటర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ అండ్ క్లీన్‌టెక్ , డిఫెన్స్ మార్కెట్‌లకు ఉపయోగపడతాయని ఫైలింగ్‌లో పేర్కొంది. ,ఏరోస్పేస్ వంటి పరిశ్రమలలో హై టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హార్డ్‌వేర్‌కు ఈ జాయింట్ వెంచర్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది.

సన్మీనా , ప్రస్తుత కస్టమర్ బేస్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు, జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశంలో ఉత్పత్తి అభివృద్ధి , హార్డ్‌వేర్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతుగా అత్యాధునిక 'మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ని సృష్టిస్తుందని ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ఇంక్యుబేషన్ సెంటర్‌ తో పాటు అదనంగా, ఇది ప్రముఖ సాంకేతికతల పరిశోధన , ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపింది.  ఈ డీల్ ప్రకటన తర్వాత, BSEలో RIL స్టాక్ 0.32 శాతం పెరిగి రూ. 2406కు చేరుకోగా, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 353.52 పాయింట్లు లేదా 0.64 శాతం పెరిగి 55,822.42 వద్ద ట్రేడవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే