పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఫోన్‌పేతో సహా 6 సంస్థలపై ఆర్‌బిఐ భారీ జరిమానా..

Ashok Kumar   | Asianet News
Published : Nov 21, 2020, 01:25 PM ISTUpdated : Nov 21, 2020, 11:35 PM IST
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఫోన్‌పేతో సహా 6 సంస్థలపై ఆర్‌బిఐ భారీ జరిమానా..

సారాంశం

పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 30 కింద ఉన్న అధికారాలను వినియోగించుకోవడంలో నియంత్రణ మార్గదర్శకాలను పాటించనందుకు ఆర్‌బి‌ఐ ఈ సంస్థలపై మానేటరీ జరిమానా విధించిందని ఒక ప్రకటనలో తెలిపింది.

రెగ్యులేటరీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పిఎన్‌బి, సోడెక్సో, ఫోన్‌పేతో సహా ఆరు సంస్థలకు మొత్తం రూ .5.78 కోట్లకు పైగా జరిమానా విధించింది.

పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 30 కింద ఉన్న అధికారాలను వినియోగించుకోవడంలో నియంత్రణ మార్గదర్శకాలను పాటించనందుకు ఆర్‌బి‌ఐ ఈ సంస్థలపై మానేటరీ జరిమానా విధించిందని ఒక ప్రకటనలో తెలిపింది.

also read విద్యార్థులను ఉద్యోగార్హులుగా మార్చడానికి వినూత్నమైన గెట్‌ సెట్‌ గో కార్యక్రమం ప్రారంభం.. ...

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) మినహా మిగిలిన ఐదు సంస్థలు నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ పరికరం (పిపిఐ) జారీ చేసేవి.

సోడెక్సో ఎస్‌విసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముథూట్ వెహికల్ & అసెట్ ఫైనాన్స్ లిమిటెడ్, క్విక్‌సిల్వర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్, ఢీల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లపై ఆర్‌బిఐ జరిమానా విధించింది.

సోడెక్సోకు అత్యధికంగా 2 కోట్ల రూపాయల జరిమానా విధించగ పిఎన్‌బి, క్విక్‌సిల్వర్ సొల్యూషన్స్ ఒక్కొక్కటి రూ.1 కోటి, ఫోన్‌పే రూ .1.39 కోట్లు, ముత్తూట్ వెహికల్ & అసెట్ ఫైనాన్స్ రూ. 34.55 లక్షలు, ఢీల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు రూ .5 లక్షలు విధించాయి.

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !