
నేడు ఆగస్ట్ 31న బుధవారం రోజున గత మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) స్థిరంగా కొనసాగించాయి. ఇంధన ధరలలో చివరిసారి మార్పును మే 22న కేంద్ర ప్రభుత్వం చేసింది. పెట్రోలుపై రూ.8, డీజిల్పై లీటరుకు రూ. 6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పట్లో ప్రకటించారు.
రాష్ట్రాల వారీగా చూస్తే మేఘాలయ ప్రభుత్వం ఇండియాలో ఇంధనాల ధరలను చివరిసారిగా మార్చింది. ఆగస్టు 24న రాష్ట్ర పన్నుల శాఖ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో బైర్నిహాట్లో పెట్రోల్ ధర రూ. 95.10 లీటరుకు, షిల్లాంగ్లో పెట్రోల్ ధర రూ. 96.83 లీటరుకి చేరింది. మరోవైపు డీజిల్ ధర బైర్నిహాట్లో రూ. 83.50 లీటరుకు, షిల్లాంగ్లో లీటరుకు రూ. 84.72గా మారింది.
ప్రస్తుతం పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 96.72 ఉండగా, డీజిల్ లీటరుకు రూ.89.62గా ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ. లీటరుకు 106.35, డీజిల్ ధర రూ. 94.28 లీటరుకి. కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24 లీటరు.
ఆగస్టు 31న కొన్ని ఇతర ప్రముఖ భారతీయ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
భోపాల్
పెట్రోలు: లీటరుకు రూ. 108.65
డీజిల్: లీటరుకు రూ. 93.90
హైదరాబాద్
పెట్రోలు: లీటరుకు రూ. 109.66
డీజిల్: లీటరుకు రూ. 97.82
బెంగళూరు
పెట్రోలు: లీటరుకు రూ. 101.94
డీజిల్: లీటరుకు రూ. 87.89
గౌహతి
పెట్రోలు: లీటరుకు రూ. 96.01
డీజిల్: లీటరుకు రూ. 83.94
లక్నో
పెట్రోలు: లీటరుకు రూ. 96.57
డీజిల్: లీటరుకు రూ. 89.76
గాంధీనగర్
పెట్రోలు: లీటరుకు రూ. 96.63
డీజిల్: లీటరుకు రూ. 92.38
తిరువనంతపురం
పెట్రోలు: లీటరుకు రూ. 107.71
డీజిల్: లీటరుకు రూ. 96.52
ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత అధికంగా కనిపించడానికి ఇదే కారణం.
ముడిచమురు ధర పెంపు ప్రక్రియ మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజులుగా పతనం నుండి కోలుకున్న తర్వాత ముడి చమురు మరోసారి $100కి దగ్గరగా ఉంది. మరోవైపు పెట్రోలు, వంటగ్యాస్ ధరలను భర్తీ చేసుకునే పరిస్థితికి చమురు కంపెనీలు చేరుకున్నాయి. అయితే డీజిల్ అమ్మకాలపై కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. బుధవారం ఉదయం WTI క్రూడ్ ధర బ్యారెల్కు 92.21 డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $ 99.79 వద్ద ఉంది.