వరుసగా 299వ రోజు స్థిరంగా ఇంధన ధరలు.. నేడు ప్రముఖ నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి..

Published : Mar 16, 2023, 09:37 AM ISTUpdated : Mar 16, 2023, 09:41 AM IST
వరుసగా 299వ రోజు స్థిరంగా ఇంధన ధరలు.. నేడు ప్రముఖ నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి..

సారాంశం

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

నేడు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 299వ రోజు అంటే గురువారం మార్చి 16న స్థిరంగా కొనసాగుతున్నాయి. 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత గత ఏడాది మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.  మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్, డీజిల్‌పై వరుసగా రూ. 5 అండ్ రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించిన తర్వాత అక్కడ ఇంధన ధరలు దిగోచ్చాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి.

 బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు:

1. లక్నోలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.57, డీజిల్ ధర లీటరుకు రూ.89.76

2. విశాఖపట్నంలో  పెట్రోల్ ధర లీటరుకు రూ.110.48, డీజిల్ ధర లీటరుకు రూ.98.27

3. అహ్మదాబాద్ లో  పెట్రోల్ ధర లీటరుకు రూ.96.63, డీజిల్ ధర లీటరుకు రూ.92.38

4. హైదరాబాద్ లో  పెట్రోల్ ధర లీటరుకు రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82

5. పాట్నా లో  పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.24, డీజిల్ ధర లీటరుకు రూ.94.04

 పాకిస్థాన్‌ దేశం పెట్రోల్‌పై రూ.5, హైస్పీడ్‌ డీజిల్‌ (హెచ్‌ఎస్‌డీ)పై లీటరుకు రూ.13 చొప్పున పెంచింది. కొత్త ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి.

తాజా సవరణతో నగదు కొరత ఉన్న దేశంలో పెట్రోల్ ధర లీటరుకు PKR 272 అయితే హై-స్పీడ్ డీజిల్ (HSD) లీటరుకు PKR 293కి విక్రయించబడుతుంది. కిరోసిన్ ధర లీటరుకు రూ.190.29కి ఎగబాకగా, లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్‌డిఓ) ధర లీటరుకు రూ.184.68గా ఉంది.

PREV
click me!

Recommended Stories

Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం