వరుసగా 2వ రోజూ కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. నేడు లీటరుకు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jan 07, 2021, 01:42 PM ISTUpdated : Jan 07, 2021, 11:46 PM IST
వరుసగా 2వ రోజూ కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. నేడు లీటరుకు ఎంతంటే ?

సారాంశం

చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం, గురువారం పెట్రోల్ ధరపై లీటరుకు 23 పైసలు, డీజిల్ ధర లీటరుకు 26 పైసలు పెంచింది. 

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వరుసగా రెండో రోజు కూడా ఇంధన ధరలను పెంచాయి. నేటి ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.84.20కు పెరిగింది.

చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం, గురువారం పెట్రోల్ ధరపై లీటరుకు 23 పైసలు, డీజిల్ ధర లీటరుకు 26 పైసలు పెంచింది. గతకొంత కాలంగా 29 రోజులు ధర స్థిరంగా ఉన్న ఇంధన ధరలు నిన్న పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. 

2018 అక్టోబర్ 4న పెట్రోల్ ధర గరిష్టంగా లీటరుకు 84 రూపాయలు చేరింది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ.75.45 పెరిగింది. ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం  నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉంది.

నగరం              డీజిల్    పెట్రోల్

ఢీల్లీ                 74.38    84.20

కోల్‌కతా            77.97    85.68

ముంబై             81.07    90.83

చెన్నై               79.72    86.96

హైదరాబాద్       80.60           87.06 

also read మీరు ఒక్కసారి ఈ ఎల్ఐసి పథకంలో పెట్టుబడి పెడితే, మీకు జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. ...

2018 అక్టోబర్ లో ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 1.50 తగ్గించింది. దానితో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు లీటరుకు మరో రూ.1 ధరలను తగ్గించారు.

పన్నులతో పాటు, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ చమురు ధరలు ఇంకా రూపాయి డాలర్ల మారకపు రేటుపై ఆధారపడి ఉంటాయి.  

ప్రపంచ మార్కెట్లలో అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు 1.3% లాభం పొందిన తరువాత 8 సెంట్లు పెరిగి బ్యారెల్కు 54.38 డాలర్లకు చేరుకుంది. ఉత్పత్తిని తగ్గించడానికి సౌదీ అరేబియా ఏకపక్షంగా అంగీకరించిన తరువాత కఠినమైన సరఫరా  ఇటీవలి రోజుల్లో ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు దారితీసింది.

ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి దేశం సౌదీ అరేబియా ఫిబ్రవరి - మార్చి నెలల్లో రోజుకు ఒక మిలియన్ బారెల్స్ (బిపిడి) ఉత్పత్తిని స్వచ్ఛందంగా తగ్గిస్తుందని తెలిపింది.

అదనపు ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం మార్చి 2020 - మే 2020లో రెండు విడతలుగా పెట్రోల్‌పై లీటరుకు రూ.13, డీజిల్‌పై లీటరుకు రూ.15 పెంచింది.  

PREV
click me!

Recommended Stories

Business Ideas: ప‌నికి రాని కొబ్బ‌రి చిప్ప‌ల‌తో కోట్లు కురిపించ‌వ‌చ్చు.. ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్
Vacant Plot Income: ఇంటి స్థలం ఖాళీగా ఉందా? వీటిని పండిస్తే ఆదాయం గ్యారెంటీ