కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా కానుక, రూ. 2 లక్షల వరకూ అకౌంట్లో పడే చాన్స్..

Published : Sep 27, 2022, 02:31 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా కానుక, రూ. 2 లక్షల వరకూ అకౌంట్లో పడే చాన్స్..

సారాంశం

కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో  మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించబోతోంది. పండుగల సీజన్ ప్రారంభం కాగా, నవరాత్రుల సందర్భంగా ఉద్యోగులకు కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో, ఇప్పుడు ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిలపై నిర్ణయాన్ని కూడా ప్రకటించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు త్వరలో శుభవార్త అందనుంది.  మోడీ ప్రభుత్వం పెరిగిన DA (డియర్‌నెస్ అలవెన్స్-DA) డబ్బును త్వరలో వారి ఖాతాల్లో జమచేసే అవకాశం ఉంది. రేపు సెప్టెంబర్ 28న జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.

మీడియాలో వ్యాప్తిలో ఉన్న నివేదికల ప్రకారం, ఈ సమావేశంలో డీఏను పెంచడంతో పాటు, కరోనా కాలంలో స్తంభింపచేసిన 18 నెలల డీఏ బకాయిలను కూడా మోడీ ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర ఉద్యోగులకు ఏకంగా రూ.1.5 లక్షలు అందుతాయి. రెండేళ్ల క్రితం నిలిచిపోయిన ఈ డీఏ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే జులై నాటికి డీఏ పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఉద్యోగుల సంఘాల డిమాండ్‌ మేరకు స్తంభించిన 18 నెలల డీఏను కూడా విడుదల చేయాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచామని, అయితే ఇంతవరకు పరిష్కారం లభించలేదని జేసీఎం జాతీయ మండలి చెబుతోంది.

డీఏ ఎందుకు స్తంభింపజేశారు?
కరోనా కాలంలో, మోడీ ప్రభుత్వం సుమారు 29 లక్షల కోట్ల రూపాయల ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. ఈ సమయంలో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల డిఎ స్తంభింపజేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలలుగా డీఏ చెల్లించలేదు. అయితే దీని తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి డీఏ పెంచడం ప్రారంభించగా, గతేడాది జనవరిలో కూడా 3 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. ఈసారి డీఏ 4 శాతం పెరగవచ్చని, ఆ విధంగా డీఏ 38 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. 

ఎంత డీఏ డబ్బులు వస్తాయి
మీడియా నివేదికల ప్రకారం, లెవెల్ 1 ఉద్యోగులు 18 నెలల పాటు DA స్తంభింపజేసినట్లయితే, వారి ఖాతా ఒకేసారి రూ.11,800 నుండి రూ.37,000 వరకు పెరుగుతుంది. అదే సమయంలో, లెవల్ 13 ఉద్యోగుల ఖాతాలో రూ. 1,44,200 నుండి రూ. 2,18,200 వరకు ఒకేసారి పెరుగుదల ఉండవచ్చు. అదేవిధంగా, పెన్షనర్లు కూడా DR రూపంలో మెరుగైన డబ్బును పొందుతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సిబ్బంది, శిక్షణ విభాగం, వ్యయ శాఖ మధ్య సమావేశం జరగడం గమనార్హం. ఇందులో 18 నెలల డీఏపై అభిప్రాయం ఏర్పడవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది