ప్రతి నెల రూ.42 కడితే చాలు.. లైఫ్ టైం పెన్షన్.. సూపర్ స్కీమ్.!

By Ashok kumar SandraFirst Published Mar 20, 2024, 5:32 PM IST
Highlights

అటల్ పెన్షన్ యోజనలో ప్రతి నెల రూ. 42 పెట్టుబడి పెట్టడం  ద్వారా  జీవితకాల పెన్షన్ పొందవచ్చు. ఈ స్కిం  గురించి మరింత సమాచారం మీకోసం...
 

అన్ని వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు యువత, మహిళలు, రైతులు ఇంకా వృద్ధుల కోసం తీసుకొచ్చారు. ఈరోజు నుంచి డబ్బు జమ చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్ల నుంచి బతికున్నంత వరకు పెన్షన్ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఈ పెన్షన్ ద్వారా  ప్రతినెలా రూ.1 వేల నుంచి రూ.5 వేల వరకు లభిస్తుంది.

దీని కోసం మీరు  కేవలం 42 రూపాయలు మాత్రమే పెట్టుబడి  చేయాల్సి ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన (APY). ఇది అసంఘటిత రంగంలోని కార్మికులపై దృష్టి సారించే భారతీయ పౌరులందరికీ పెన్షన్ పథకం. ఈ పెన్షన్ పథకం కింద, 60 ఏళ్ల వయస్సు నుండి  మీరు రూ.1000, 2000, 3000, 4000 లేదా 5000 ప్రతినెలా  పెన్షన్ పొందవచ్చు.

ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బట్టి పెన్షన్ పొందుతారు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 40 ఏళ్ల తర్వాత మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు. దరఖాస్తుదారుడికి  తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్  ఉండాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత, మీరు మీ అకౌంట్ సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు. ఇప్పుడు 18 సంవత్సరాల వయస్సు నుండి, మీరు ప్రతి నెలా కేవలం 42 రూపాయలు డిపాజిట్ చేస్తే, 60 ఏళ్ల తరువాత మీకు ప్రతినెలా  1000 రూపాయల పెన్షన్ వస్తుంది. కాగా, రూ.84 పెట్టుబడి పెడితే రూ.2,000 పెన్షన్‌గా అందుతుంది. అదేవిధంగా రూ.210 చెల్లిస్తే రూ.5 వేల వరకు ప్రతినెలా  పింఛను అందుతుంది.

అయితే, ప్రతి నెలా డిపాజిట్ చేయాల్సిన మొత్తం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ల వయసులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెలా రూ.1454 పింఛను కింద రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా 30 ఏళ్ల నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టి 60 ఏళ్లు నిండకముందే ఏదో ఒక కారణంతో మరణిస్తే భర్త లేదా భార్యకు అదే పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ చనిపోతే, మొత్తం నామినీకి చెల్లించబడుతుంది.

click me!