Airfares Likely To Fall: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 40 శాతం ఛార్జీలు తగ్గే ఛాన్స్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 11, 2022, 03:10 PM ISTUpdated : Mar 11, 2022, 03:15 PM IST
Airfares Likely To Fall: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 40 శాతం ఛార్జీలు తగ్గే ఛాన్స్‌..!

సారాంశం

మార్చి 27 నుండి సాధారణ అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున విమాన ఛార్జీలు 40% వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ అధికారులు తెలిపారు.

క‌రోనా నేపథ్యంలో ఆంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు నడిపేందుకు అనుమతి ఉండటంతో విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇటీవల విమాన ఇంధనం ధర ATF ధర పెరిగింది. ఇది మరింత భారమైంది. కరోనా ముందుస్థాయి ధరలతో పోలిస్తే ప్రస్తుతం 100 శాతం ఛార్జీలు అంటే రెండింతలు ఉన్నాయి. అయితే ఈ నెల 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సర్వీసులను పునరుద్ధరిస్తే ఛార్జీలకు సంబంధించి విమాన ప్రయాణీకులకు భారీ ఊరట దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇది ట్రావెలర్స్‌కు గుడ్ న్యూస్.

ప్రభుత్వం విమాన సర్వీసులకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో విమాన ప్రయాణ ధరలు 40 శాతం వరకు దిగి రావొచ్చు. విమాన సర్వీసులు పెంచడం వల్ల వారికి విమాన అద్దె భారం తగ్గుతుంది. కరోనా సమయంలో అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశారు. రెండేళ్ల తర్వాత వీటిని పునరుద్ధరిస్తున్నారు.

లుఫ్తాన్సా, గ్రూప్ క్యారియర్ స్విస్ వచ్చే కొద్ది నెలల్లో తమ సర్వీసులను రెట్టింపు చేయాలని చూస్తున్నాయి. మరోవైపు, సింగపూర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను 17 శాతం పెంచాయి. డొమెస్టిక్ క్యారియర్ ఇండిగో వచ్చే కొద్ది నెలల్లో 100 గ్లోబల్ ఫ్లైట్స్ నడిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఆయా దేశాలతో ఉన్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను నడిపిస్తున్నారు. సర్వీసుల పునరుద్ధరణతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తిరిగి కరోనా ముందుస్థాయి సమీపానికి వస్తాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం, విమానయాన సంస్థలు కొన్ని దేశాలతో బబుల్ ఏర్పాట్లలో పరిమిత సంఖ్యలో విదేశీ విమానాలను నడుపుతున్నాయి. భారతదేశం సాధారణ అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పరిమిత సామర్థ్యం కారణంగా భారతదేశం-యుఎస్ వంటి కొన్ని మార్గాల్లో మహమ్మారి కంటే ముందు విమాన ఛార్జీలు 100% వరకు పెరిగాయి. "సాధారణ అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్ డిమాండ్-సరఫరా అసమతుల్యతను సృష్టించింది. బబుల్ ఒప్పందాల ప్రకారం కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు ఖరీదైనవిగా మారాయి" అని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్‌పాయ్ అన్నారు. "సామర్థ్యం తిరిగి రావడం, కనెక్టివిటీ, మరిన్ని రూట్ల పెరుగుదలతో, అంతర్జాతీయ ఛార్జీలు కోవిడ్-పూర్వ స్థాయికి తిరిగి వస్తాయని మేము ఆశిస్తున్నామని" తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sangeetha 52nd Anniversary Sale: సంగీత 52వ వార్షికోత్సవ సేల్ షురూ.. అదిరిపోయే ఆఫర్లు బాస్ !
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!