మళ్లీ బీరు రేటు పెంచనున్న ప్రభుత్వం: ఏడాదికి ఎన్నిసార్లు ధర పెరిగిందంటే ..?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత రెండోసారి మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీరు ధరను పెంచాలని ప్రతిపాదించి ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది.
 

Google News Follow Us

బెంగళూరు (జనవరి 23): కర్ణాటక రాష్ట్రంలోని  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేసి ఆదాయ వనరుల కోసం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్యంపై 20% సుంకం పెంచిన ప్రభుత్వం.. 6 నెలల తర్వాత మళ్లీ మద్యం ధరను పెంచబోతోంది. ప్రధానంగా బీరు ధరలను కూడా పెంచాలని భావిస్తుంది .

అవును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 2వ సారి మద్యం ధరలను పెంచి మద్యం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చింది. బీర్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచాలని భావిస్తోంది .  అయితే ఒక్క బీరు సీసాపై 8 నుంచి 10 రూపాయలు  ఎక్సైజ్ శాఖ మాత్రం రేటు పెంచాలని యోచిస్తోంది. ఈ నెల ప్రారంభంలో కొన్ని మద్యం కంపెనీలు కొన్ని మద్యం  బ్రాండ్ల ధరలను పెంచాయి. ఈ నేపథ్యంలో త్వరలో బీరు ధరలు పెరిగే అవకాశం ఉంది.


దీంతో ఇప్పుడు బీరు ధరను పెంచే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ పడింది. ఎక్సైజ్ శాఖ 10% పన్నతో   బీరు బాటిల్‌పై రూ.8 నుంచి 10 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. గత   ఆరు నెలల్లో రెండోసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

జనవరి లేదా ఫిబ్రవరి చివరి వారంలో కొత్త రేట్లు  అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 650 మి.లీ మద్యం బాటిల్‌కు 8 నుంచి 10 పెంచనున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అభ్యంతరం తెలిపేందుకు 7 రోజుల గడువు ఇచ్చింది. ప్రజలు అభ్యంతర పిటిషన్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి దాఖలు చేయవచ్చు. 

జనవరి ప్రారంభంలోనే ధరల పెంపు: జనవరి ప్రారంభంలో పేదలకు ఇష్టమైన కొన్ని బ్రాండ్‌ల ధరలను పెంచారు, దింతో మద్యం మరింత ఖరీదైనది. కొన్ని కంపెనీలు క్వార్టర్ మద్యంపై రూ.20 నుంచి రూ.30 పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా OT, BP, 8 PM రేట్లు  శాతం 20 శాతం  పెరగడంతో మద్యం ప్రియులు షాక్‌కు గురయ్యారు. ధరల పెంపుపై ఇప్పటికే బార్ యజమానులకు సందేశం పంపారు. మద్యం ధరను పెంచబోమని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారిగా పెంచడంతో మద్యం ప్రియులు ఎక్సైజ్ శాఖపై, కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ  ఉండటంతో    పలు మద్యం కంపెనీలు ధరలను పెంచాయి.